తెలుగులో సంగీత దర్శకుడిగా తమన్ ప్రయాణం కిక్ అనే బ్లాక్బస్టర్ మూవీతో మొదలైంది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడం, పాటలకూ మంచి స్పందన రావడంతో కెరీర్ ఆరంభంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు తమన్. పెద్ద పెద్ద హీరోలతో చాలా త్వరగా సినిమాలు చేసేశాడు. కానీ కెరీర్లో తొలి దశాబ్దంలో అతను ఎప్పుడూ నంబర్ వన్ అని మాత్రం అనిపించుకోలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ అతడి మీద ఆధిపత్యం చలాయిస్తూనే వచ్చాడు. కానీ గత రెండు మూడేళ్లలో కథ మారిపోయింది.
తమన్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని భిన్నమైన పాటలు ఇవ్వడం, వరుసగా అతడి ఆడియోలకు అదిరే రెస్పాన్స్ రావడంతో దేవిశ్రీ వెనుకబడిపోయాడు. ఇప్పుడు తమన్ టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు.
కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ భాషల్లో తమన్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నాడు. 2021లో అతడి చేతిలో పది సినిమాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో దాదాపు అన్ని సినిమాలూ ఈ ఏడాదే రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఈ పది చిత్రాల్లో అతి త్వరలోనే కొన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే.. క్రాక్, ఈశ్వరన్. ఈ చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఇవి కాక పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్, అయ్యప్పనుం కోషీయుం రీమేక్ తమన్ ఖాతాలోనివే. అలాగే మహేష్ బాబు చిత్రం సర్కారు వారి పాటకూ తమనే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా నాని టక్ జగదీష్, వరుణ్ తేజ్ బాక్సర్, బాలకృష్ణ-బోయపాటి చిత్రం.. ఇలాంటి క్రేజీ సినిమాలు తమన్ చేతిలో ఉన్నాయి. కన్నడలో పునీత్ రాజ్కుమార్ సినిమా యువరత్న, మలయాళంలో పృథ్వీరాజ్ హీరోగా తెరకెక్కుతున్న కడువ చిత్రాలకూ తమనే సంగీతం అందిస్తుండటం విశేషం. మొత్తంగా చూస్తే 2021లో సౌత్ ఇండియాలో తమన్ను కొట్టే సంగీత దర్శకుడు లేనట్లే.
This post was last modified on January 3, 2021 12:25 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…