థియేటర్లు తెరుచుకున్నాక ఓటీటీల జోరు కొంచెం తగ్గినప్పటికీ.. అక్కడ కొత్త సినిమాల రిలీజ్ అయితే ఇప్పుడిప్పుడే ఆగేట్లు లేదు. ముందే ఒప్పందాలు జరిగి ఉండటం వల్లో, లేదా ఇంకా 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవని నేపథ్యంలో కొత్త సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్ నటించిన కొత్త సినిమా ‘దృశ్యం-2’ను అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక కూడా తన కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’ను ఓటీటీలోకి తేనున్నాడు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ చాలా రోజుల ముందే కొనేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం నిజమే అట. ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్లో ప్రిమియర్స్ కూడా కన్ఫమ్ అయ్యాయని తాజా సమాచారం.
సంక్రాంతికి ఒకటికి నాలుగు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో కొంచెం గ్యాప్ ఇచ్చి గణతంత్ర దినోత్సవ కానుకగా ‘వైల్డ్ డాగ్’ను ప్రేక్షకుల ముందుకు తేనున్నారట. జనవరి 25 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతుందట. ట్రెండును అందిపుచ్చుకుని అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో నాగార్జున ముందుంటారు. ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తున్న నేపథ్యంలో ఆయన ధైర్యం చేసి తన చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్కు ఇప్పించేసినట్లు తెలుస్తోంది. టాలీవుల్ టాప్ స్టార్లలో ఓటీటీ బాట పట్టిన తొలి హీరో నాగార్జునే కావడం విశేషం. ‘మహర్షి’ రచయిత సాల్మన్ ‘వైల్డ్ డాగ్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్గా కనిపించనున్నాడు. టెర్రరిస్టు ఆపరేషన్ల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ‘రేయ్’ భామ సయీమీ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించింది.
This post was last modified on January 2, 2021 8:39 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…