మెగాస్టార్ అభిమానులకు ‘ఆహా’ టీం సారీ.. సోషల్ మీడియాలో నిన్నట్నుంచి చర్చనీయాంశం అవుతున్న వార్త. మెగాస్టార్ అభిమానులకు అల్లు అరవింద్ నేతృత్వంలోని ‘ఆహా’ ఓటీటీ వారు సారీ చెప్పడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారందరూ. నిజానికి ఈ స్టేట్మెంట్ వచ్చాకే చాలామందికి అసలు విషయం తెలిసింది.
‘ఆహా’లోని సామ్ జామ్ ప్రోగ్రాంకు ఇటీవలే అల్లు అర్జున్ అతిథిగా రావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రిమియర్స్కు ముందు ప్రమోషన్లు ఓ రేంజిలో చేస్తున్నారు. దీని కంటే ముందు వచ్చిన చిరు ఎపిసోడ్ను మించి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. చిరు ఎపిసోడ్ ముందు వేసి.. బన్నీ ఎపిసోడ్ను కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేయడమే మెగా అభిమానులకు ముందసలు రుచించలేదు. చిరు కంటే బన్నీ ఎక్కువా అనే ప్రశ్న అప్పుడే వారిలో తలెత్తింది. దీనికి తోడు.. బన్నీ ఎపిసోడ్కు సంబంధించిన ఓ ప్రోమోలో అతడి పేరు ముందు ‘మెగాస్టార్’ తగిలించడం చిరు అభిమానులకు అస్సలు నచ్చలేదు.
సంబంధిత స్క్రీన్ షాట్లు పెట్టి బన్నీని తిట్టడం మొదులపెట్టారు చిరు ఫ్యాన్స్. ఐతే విషయం మరీ చర్చనీయాంశం ఏమీ కాలేదు. కానీ దీని గురించి సారీ చెబుతూ ‘ఆహా’ స్టేట్మెంట్ రిలీజ్ చేయడంతో జనాలు అసలు విషయం ఏంటని తెలుసుకున్నారు. ఇప్పుడు మెగా అభిమానులందరికీ విషయం బోధపడింది. ఇప్పుడు మరింతగా బన్నీని టార్గెట్ చేస్తున్నారు. ‘ఆహా’ టీం సారీని అసలు పట్టించుకోవట్లేదు. పాత విషయాలు కూడా బయటికి తీసి బన్నీని ట్రోల్ చేస్తున్నారు.
‘అల వైకుంఠపురములో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ.. ఇంతకుముందులా ‘మెగా అభిమానులు’ అనే మాట వాడకుండా.. ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అని పేర్కొనడం.. తాను ఇంత వాడిని కావడానికి వాళ్లే కారణం అంటూ వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల విషయంలో బన్నీ వ్యవహరించిన తీరును కూడా మళ్లీ ఇంకోసారి చర్చిస్తున్నారు. ఈ మధ్య సొంత ఇమేజ్ కోసం బన్నీ పరితపిస్తున్న విషయాన్న ఎత్తి చూపి బన్నీకి తలబిరుసు ఎక్కువైందని.. అల్లు అర్జున్ పేరు వెనుక ‘మెగాస్టార్’ పెట్టడం కూడా అతడి టీం పనే అని విమర్శిస్తున్నారు.
This post was last modified on January 1, 2021 6:33 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…