మెగాస్టార్ అభిమానులకు ‘ఆహా’ టీం సారీ.. సోషల్ మీడియాలో నిన్నట్నుంచి చర్చనీయాంశం అవుతున్న వార్త. మెగాస్టార్ అభిమానులకు అల్లు అరవింద్ నేతృత్వంలోని ‘ఆహా’ ఓటీటీ వారు సారీ చెప్పడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారందరూ. నిజానికి ఈ స్టేట్మెంట్ వచ్చాకే చాలామందికి అసలు విషయం తెలిసింది.
‘ఆహా’లోని సామ్ జామ్ ప్రోగ్రాంకు ఇటీవలే అల్లు అర్జున్ అతిథిగా రావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రిమియర్స్కు ముందు ప్రమోషన్లు ఓ రేంజిలో చేస్తున్నారు. దీని కంటే ముందు వచ్చిన చిరు ఎపిసోడ్ను మించి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. చిరు ఎపిసోడ్ ముందు వేసి.. బన్నీ ఎపిసోడ్ను కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేయడమే మెగా అభిమానులకు ముందసలు రుచించలేదు. చిరు కంటే బన్నీ ఎక్కువా అనే ప్రశ్న అప్పుడే వారిలో తలెత్తింది. దీనికి తోడు.. బన్నీ ఎపిసోడ్కు సంబంధించిన ఓ ప్రోమోలో అతడి పేరు ముందు ‘మెగాస్టార్’ తగిలించడం చిరు అభిమానులకు అస్సలు నచ్చలేదు.
సంబంధిత స్క్రీన్ షాట్లు పెట్టి బన్నీని తిట్టడం మొదులపెట్టారు చిరు ఫ్యాన్స్. ఐతే విషయం మరీ చర్చనీయాంశం ఏమీ కాలేదు. కానీ దీని గురించి సారీ చెబుతూ ‘ఆహా’ స్టేట్మెంట్ రిలీజ్ చేయడంతో జనాలు అసలు విషయం ఏంటని తెలుసుకున్నారు. ఇప్పుడు మెగా అభిమానులందరికీ విషయం బోధపడింది. ఇప్పుడు మరింతగా బన్నీని టార్గెట్ చేస్తున్నారు. ‘ఆహా’ టీం సారీని అసలు పట్టించుకోవట్లేదు. పాత విషయాలు కూడా బయటికి తీసి బన్నీని ట్రోల్ చేస్తున్నారు.
‘అల వైకుంఠపురములో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ.. ఇంతకుముందులా ‘మెగా అభిమానులు’ అనే మాట వాడకుండా.. ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అని పేర్కొనడం.. తాను ఇంత వాడిని కావడానికి వాళ్లే కారణం అంటూ వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల విషయంలో బన్నీ వ్యవహరించిన తీరును కూడా మళ్లీ ఇంకోసారి చర్చిస్తున్నారు. ఈ మధ్య సొంత ఇమేజ్ కోసం బన్నీ పరితపిస్తున్న విషయాన్న ఎత్తి చూపి బన్నీకి తలబిరుసు ఎక్కువైందని.. అల్లు అర్జున్ పేరు వెనుక ‘మెగాస్టార్’ పెట్టడం కూడా అతడి టీం పనే అని విమర్శిస్తున్నారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…