మెగాస్టార్ అభిమానులకు ‘ఆహా’ టీం సారీ.. సోషల్ మీడియాలో నిన్నట్నుంచి చర్చనీయాంశం అవుతున్న వార్త. మెగాస్టార్ అభిమానులకు అల్లు అరవింద్ నేతృత్వంలోని ‘ఆహా’ ఓటీటీ వారు సారీ చెప్పడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారందరూ. నిజానికి ఈ స్టేట్మెంట్ వచ్చాకే చాలామందికి అసలు విషయం తెలిసింది.
‘ఆహా’లోని సామ్ జామ్ ప్రోగ్రాంకు ఇటీవలే అల్లు అర్జున్ అతిథిగా రావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రిమియర్స్కు ముందు ప్రమోషన్లు ఓ రేంజిలో చేస్తున్నారు. దీని కంటే ముందు వచ్చిన చిరు ఎపిసోడ్ను మించి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. చిరు ఎపిసోడ్ ముందు వేసి.. బన్నీ ఎపిసోడ్ను కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేయడమే మెగా అభిమానులకు ముందసలు రుచించలేదు. చిరు కంటే బన్నీ ఎక్కువా అనే ప్రశ్న అప్పుడే వారిలో తలెత్తింది. దీనికి తోడు.. బన్నీ ఎపిసోడ్కు సంబంధించిన ఓ ప్రోమోలో అతడి పేరు ముందు ‘మెగాస్టార్’ తగిలించడం చిరు అభిమానులకు అస్సలు నచ్చలేదు.
సంబంధిత స్క్రీన్ షాట్లు పెట్టి బన్నీని తిట్టడం మొదులపెట్టారు చిరు ఫ్యాన్స్. ఐతే విషయం మరీ చర్చనీయాంశం ఏమీ కాలేదు. కానీ దీని గురించి సారీ చెబుతూ ‘ఆహా’ స్టేట్మెంట్ రిలీజ్ చేయడంతో జనాలు అసలు విషయం ఏంటని తెలుసుకున్నారు. ఇప్పుడు మెగా అభిమానులందరికీ విషయం బోధపడింది. ఇప్పుడు మరింతగా బన్నీని టార్గెట్ చేస్తున్నారు. ‘ఆహా’ టీం సారీని అసలు పట్టించుకోవట్లేదు. పాత విషయాలు కూడా బయటికి తీసి బన్నీని ట్రోల్ చేస్తున్నారు.
‘అల వైకుంఠపురములో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ.. ఇంతకుముందులా ‘మెగా అభిమానులు’ అనే మాట వాడకుండా.. ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అని పేర్కొనడం.. తాను ఇంత వాడిని కావడానికి వాళ్లే కారణం అంటూ వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల విషయంలో బన్నీ వ్యవహరించిన తీరును కూడా మళ్లీ ఇంకోసారి చర్చిస్తున్నారు. ఈ మధ్య సొంత ఇమేజ్ కోసం బన్నీ పరితపిస్తున్న విషయాన్న ఎత్తి చూపి బన్నీకి తలబిరుసు ఎక్కువైందని.. అల్లు అర్జున్ పేరు వెనుక ‘మెగాస్టార్’ పెట్టడం కూడా అతడి టీం పనే అని విమర్శిస్తున్నారు.
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…