టాలీవుడ్లో అత్యధిక మంది హీరోలున్నది ‘మెగా’ ఫ్యామిలీ అన్న సంగతి తెలిసిందే. చిరంజీవికి వేసిన పునాది మీద చాలామంది తమ కెరీర్లను నిర్మించుకున్నారు. చిరు అండ్ కోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే కొత్త హీరోలకు వరంగా మారుతుంటుంది. మంచి సినిమాను ఎంచుకుని అరంగేట్రం చేస్తే.. సొంత టాలెంట్ చూపిస్తే మెగా అభిమానులు యువ హీరోలను నెత్తిన పెట్టుకుంటారని ఇంతకుముందే రుజువైంది.
గత కొన్నేళ్లలో హీరోలైన మెగా కుర్రాళ్లలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ బాగానే నిలదొక్కుకున్నారు. ఐతే అల్లు శిరీష్ మాత్రం తడబడుతున్నాడు. ఇక మెగా ఫ్యామిలీలోకి బయటి నుంచి వచ్చి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ పరిస్థితి మరీ కష్టంగా ఉంది. చిరు అల్లుడిగా ఘనంగానే అరంగేట్రం చేసినా ‘విజేత’ సినిమా అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా ఆడలేదు. అలాగే కళ్యాణ్ నటనకూ అంత పేరు రాలేదు.
‘సూపర్ మచ్చి’ పేరుతో రెండో సినిమా చేయగా.. దాని గురించి అతీ గతీ లేదు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ చేశారు. సినిమాను పూర్తి చేశారు. అంతకుమించి ఏ అప్ డేట్ లేదు. సినిమా అసలేమాత్రం వార్తల్లో లేదు. ప్రేక్షకుల్లో కూడా దీనిపై ఆసక్తి కనిపించడం లేదు. ఈ సినిమా మేకింగ్లో ఉండగానే కళ్యాణ్ దేవ్ హీరోగా ‘కిన్నెరసాని’ పేరుతో ఓ కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మిత్రుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు.
అశ్వత్థామ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ ఈ చిత్రానికి డైరెక్టర్. ప్రారంభోత్సవం కొంచెం ఘనంగానే చేసి సినిమాను అనౌన్స్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి సినిమా బాగా రావట్లదేని ఆపేశారా.. ఇంకేదైనా కారణాలున్నాయా అన్నది తెలియదు కానీ.. ఈ చిత్రం ఆగిపోయినట్లు మాత్రం ఇండస్ట్రీలో గట్టి ప్రచారమే జరుగుతోంది. మంచి బ్యాకప్ ఉండి, ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్.. తన కెరీర్ ఇలా అవుతుందని ఊహించి ఉండడేమో.
This post was last modified on December 31, 2020 6:49 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…