టాలీవుడ్లో అత్యధిక మంది హీరోలున్నది ‘మెగా’ ఫ్యామిలీ అన్న సంగతి తెలిసిందే. చిరంజీవికి వేసిన పునాది మీద చాలామంది తమ కెరీర్లను నిర్మించుకున్నారు. చిరు అండ్ కోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే కొత్త హీరోలకు వరంగా మారుతుంటుంది. మంచి సినిమాను ఎంచుకుని అరంగేట్రం చేస్తే.. సొంత టాలెంట్ చూపిస్తే మెగా అభిమానులు యువ హీరోలను నెత్తిన పెట్టుకుంటారని ఇంతకుముందే రుజువైంది.
గత కొన్నేళ్లలో హీరోలైన మెగా కుర్రాళ్లలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ బాగానే నిలదొక్కుకున్నారు. ఐతే అల్లు శిరీష్ మాత్రం తడబడుతున్నాడు. ఇక మెగా ఫ్యామిలీలోకి బయటి నుంచి వచ్చి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ పరిస్థితి మరీ కష్టంగా ఉంది. చిరు అల్లుడిగా ఘనంగానే అరంగేట్రం చేసినా ‘విజేత’ సినిమా అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా ఆడలేదు. అలాగే కళ్యాణ్ నటనకూ అంత పేరు రాలేదు.
‘సూపర్ మచ్చి’ పేరుతో రెండో సినిమా చేయగా.. దాని గురించి అతీ గతీ లేదు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ చేశారు. సినిమాను పూర్తి చేశారు. అంతకుమించి ఏ అప్ డేట్ లేదు. సినిమా అసలేమాత్రం వార్తల్లో లేదు. ప్రేక్షకుల్లో కూడా దీనిపై ఆసక్తి కనిపించడం లేదు. ఈ సినిమా మేకింగ్లో ఉండగానే కళ్యాణ్ దేవ్ హీరోగా ‘కిన్నెరసాని’ పేరుతో ఓ కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మిత్రుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు.
అశ్వత్థామ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ ఈ చిత్రానికి డైరెక్టర్. ప్రారంభోత్సవం కొంచెం ఘనంగానే చేసి సినిమాను అనౌన్స్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి సినిమా బాగా రావట్లదేని ఆపేశారా.. ఇంకేదైనా కారణాలున్నాయా అన్నది తెలియదు కానీ.. ఈ చిత్రం ఆగిపోయినట్లు మాత్రం ఇండస్ట్రీలో గట్టి ప్రచారమే జరుగుతోంది. మంచి బ్యాకప్ ఉండి, ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్.. తన కెరీర్ ఇలా అవుతుందని ఊహించి ఉండడేమో.
This post was last modified on December 31, 2020 6:49 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…