టాలీవుడ్లో అత్యధిక మంది హీరోలున్నది ‘మెగా’ ఫ్యామిలీ అన్న సంగతి తెలిసిందే. చిరంజీవికి వేసిన పునాది మీద చాలామంది తమ కెరీర్లను నిర్మించుకున్నారు. చిరు అండ్ కోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే కొత్త హీరోలకు వరంగా మారుతుంటుంది. మంచి సినిమాను ఎంచుకుని అరంగేట్రం చేస్తే.. సొంత టాలెంట్ చూపిస్తే మెగా అభిమానులు యువ హీరోలను నెత్తిన పెట్టుకుంటారని ఇంతకుముందే రుజువైంది.
గత కొన్నేళ్లలో హీరోలైన మెగా కుర్రాళ్లలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ బాగానే నిలదొక్కుకున్నారు. ఐతే అల్లు శిరీష్ మాత్రం తడబడుతున్నాడు. ఇక మెగా ఫ్యామిలీలోకి బయటి నుంచి వచ్చి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ పరిస్థితి మరీ కష్టంగా ఉంది. చిరు అల్లుడిగా ఘనంగానే అరంగేట్రం చేసినా ‘విజేత’ సినిమా అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా ఆడలేదు. అలాగే కళ్యాణ్ నటనకూ అంత పేరు రాలేదు.
‘సూపర్ మచ్చి’ పేరుతో రెండో సినిమా చేయగా.. దాని గురించి అతీ గతీ లేదు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ చేశారు. సినిమాను పూర్తి చేశారు. అంతకుమించి ఏ అప్ డేట్ లేదు. సినిమా అసలేమాత్రం వార్తల్లో లేదు. ప్రేక్షకుల్లో కూడా దీనిపై ఆసక్తి కనిపించడం లేదు. ఈ సినిమా మేకింగ్లో ఉండగానే కళ్యాణ్ దేవ్ హీరోగా ‘కిన్నెరసాని’ పేరుతో ఓ కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మిత్రుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు.
అశ్వత్థామ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ ఈ చిత్రానికి డైరెక్టర్. ప్రారంభోత్సవం కొంచెం ఘనంగానే చేసి సినిమాను అనౌన్స్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి సినిమా బాగా రావట్లదేని ఆపేశారా.. ఇంకేదైనా కారణాలున్నాయా అన్నది తెలియదు కానీ.. ఈ చిత్రం ఆగిపోయినట్లు మాత్రం ఇండస్ట్రీలో గట్టి ప్రచారమే జరుగుతోంది. మంచి బ్యాకప్ ఉండి, ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్.. తన కెరీర్ ఇలా అవుతుందని ఊహించి ఉండడేమో.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…