హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య 4కె స్క్రీన్, అట్మాస్ సౌండ్ చేయించారు కానీ ఇంకా ఇతర సౌకర్యాలు పాతవే ఉన్నాయి. ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సింగల్ స్క్రీన్ ని ఉద్దేశించి నిర్మాతలు మాట్లాడుతూ రినోవేషన్ చేయలేదని, అలాంటివాటికి పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని ఎలా అడుగుతారని పేరు ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా దాని గురించి చెప్పిన సంగతి తెలిసిందే.
దానికి సమాధానంగా కాబోలు శ్రీరాములుని మళ్ళీ రీ మోడలింగ్ చేసే పనులు మొదలయ్యాయి. సీటింగ్ మార్చేయడంతో పాటు కొన్ని కీలకమైన మార్పులు యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు. ఒకవేళ జూన్ 4 పెద్ది వేయాల్సి వస్తే ఆలోగా సర్వం సిద్ధం చేసేలా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే దీన్నో మోడల్ గా చూపించి ఇకపై సింగల్ స్క్రీన్ ఎలా ఉంటాయో ఒక శాంపిల్ గా నిలబెడతారట.
ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్ లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ శ్రీరాములు మూసేయడం ఎప్పుడూ చూడలేదని, కానీ సినిమాల్లేక ఇలా జరగడం షాక్ కలిగించిందని అన్నారు. సో అసలు కారణం ఇదన్న మాట. ప్రస్తుతం బుక్ మై షో లిస్టింగ్ లో ఈ థియేటర్ తీసేశారు. వర్క్స్ అన్నీ అయ్యాక మళ్ళీ జోడిస్తారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఏవైతే కంప్లయింట్స్ ఇస్తున్నారో వాటికి సమాధానంగా సింగల్ స్క్రీన్లను సమూలంగా ప్రక్షాళన చేసే ఆలోచన ఒకరకంగా మంచిదే.
ఇప్పటికీ ఏపీ తెలంగాణలో కొన్ని సింగల్ స్క్రీన్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. వాటిని బాగుపరచడం లేదు. అందుకే ప్రేక్షకులు కూడా యాభై రూపాయలు ఎక్కువైనా పర్వాలేదని మల్టీప్లెక్సులకు వెళ్లిపోతున్నారు. బెస్ట్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నిజంగానే సింగల్ స్క్రీన్లు ప్రమాదంలో పడతాయి. అందుకే వీలైనంత త్వరగా ఆధునీకరించే పనిలో ఎగ్జిబిటర్లు పడ్డారని తెలిసింది. బహుశా శ్రీరాములు వాటిలో మొదటి అడుగు అనుకోవాలేమో.
This post was last modified on May 15, 2026 2:42 pm
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…