హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య 4కె స్క్రీన్, అట్మాస్ సౌండ్ చేయించారు కానీ ఇంకా ఇతర సౌకర్యాలు పాతవే ఉన్నాయి. ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సింగల్ స్క్రీన్ ని ఉద్దేశించి నిర్మాతలు మాట్లాడుతూ రినోవేషన్ చేయలేదని, అలాంటివాటికి పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని ఎలా అడుగుతారని పేరు ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా దాని గురించి చెప్పిన సంగతి తెలిసిందే.
దానికి సమాధానంగా కాబోలు శ్రీరాములుని మళ్ళీ రీ మోడలింగ్ చేసే పనులు మొదలయ్యాయి. సీటింగ్ మార్చేయడంతో పాటు కొన్ని కీలకమైన మార్పులు యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు. ఒకవేళ జూన్ 4 పెద్ది వేయాల్సి వస్తే ఆలోగా సర్వం సిద్ధం చేసేలా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే దీన్నో మోడల్ గా చూపించి ఇకపై సింగల్ స్క్రీన్ ఎలా ఉంటాయో ఒక శాంపిల్ గా నిలబెడతారట.
ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్ లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ శ్రీరాములు మూసేయడం ఎప్పుడూ చూడలేదని, కానీ సినిమాల్లేక ఇలా జరగడం షాక్ కలిగించిందని అన్నారు. సో అసలు కారణం ఇదన్న మాట. ప్రస్తుతం బుక్ మై షో లిస్టింగ్ లో ఈ థియేటర్ తీసేశారు. వర్క్స్ అన్నీ అయ్యాక మళ్ళీ జోడిస్తారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఏవైతే కంప్లయింట్స్ ఇస్తున్నారో వాటికి సమాధానంగా సింగల్ స్క్రీన్లను సమూలంగా ప్రక్షాళన చేసే ఆలోచన ఒకరకంగా మంచిదే.
ఇప్పటికీ ఏపీ తెలంగాణలో కొన్ని సింగల్ స్క్రీన్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. వాటిని బాగుపరచడం లేదు. అందుకే ప్రేక్షకులు కూడా యాభై రూపాయలు ఎక్కువైనా పర్వాలేదని మల్టీప్లెక్సులకు వెళ్లిపోతున్నారు. బెస్ట్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నిజంగానే సింగల్ స్క్రీన్లు ప్రమాదంలో పడతాయి. అందుకే వీలైనంత త్వరగా ఆధునీకరించే పనిలో ఎగ్జిబిటర్లు పడ్డారని తెలిసింది. బహుశా శ్రీరాములు వాటిలో మొదటి అడుగు అనుకోవాలేమో.
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…
అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
రాష్ట్రంలో ఎదగాలని, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలని భావిస్తున్న జనసేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుసరిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా…