‘బిగ్ బాస్’ షోలో సీజన్ ముగింపు దశకు వచ్చేసరికి హోమ్ సిక్తో బాధ పడుతున్న పార్టిసిపెంట్ల కోసం.. వారి కుటుంబ సభ్యుల్ని హౌస్లోకి తీసుకురావడం.. వారితో హౌస్ బయటి నుంచి మాట్లాడించడం లేదంటే.. హౌస్ లోపలికే పంపి కాసేపు తమ వ్యక్తితో మాట్లాడించే ఏర్పాటు చేయడం మామూలే.
ఆ సమయంలో ఆ పార్టిసిపెంట్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా వ్యవహరించడం.. గేమ్ బాగా ఆడుతున్నావని ప్రశంసించడం.. ఇంకా బాగా ఆడాలని ప్రోత్సహించడం చేస్తుంటారు కుటుంబ సభ్యులు. కానీ తమిళ ‘బిగ్ బాస్’లో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ లేడీ పార్టిసిపెంట్ను ఆమె తల్లి తీవ్రంగా మందలించి.. దూషించి వెళ్లడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ఉదంతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆ పార్టిసిపెంట్ పేరు.. శివాని. ఈమె తమిళంలో చిన్నా చితకా సినిమాల్లో కొన్ని పాత్రలు చేసింది. టీవీ రంగంలోనూ ఆమెకు గుర్తింపుంది. ఈ పేరుతోనే ‘బిగ్ బాస్’లోకి వచ్చిన శివాని.. 85 రోజుల పాటు హౌస్లో సర్వైవ్ అయింది. ఐతే ఆమె పట్ల వీక్షకులకు కొన్ని విషయాల్లో ప్రతికూల అభిప్రాయాలున్నాయి. టైటిల్ ఫేవరెట్గా ఉన్న ఆరితో ఆమెకు పడట్లేదు.
అలాగే హౌస్లో ఉన్న బాలాజీ అనే అబ్బాయితో ఆమె మరీ ఎక్కువ సన్నిహితంగా మెలగడం చాలామందికి నచ్చట్లేదు. తాజాగా కంటెస్టెంట్లకు వారి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించగా.. శివాని కోసం ఆమె తల్లి అఖిల వచ్చింది. తల్లిని చూడగానే శివానికి దు:ఖం పొంగుకొచ్చింది. కొన్ని నిమిషాలు ఆమెను ఓదార్చిన అఖిల.. తర్వాత ఆమెను తిట్టడం మొదలుపెట్టింది.
‘‘నువ్వు హౌస్లోకి ఎందుకొచ్చావ్.. ఇక్కడేం చేస్తున్నావ్.. మనకు తెలిసిన వాళ్లందరూ షోలో నిన్ను చూస్తారు కదా.. ఎంతసేపూ ఆ బాలాజీ వెనుక ఎందుకు తిరుగుతావ్? వాడితో నీకెందుకు? ఆరి చెప్పింది ఎందుకు వినవు? అతను చాలా మంచోడు కదా. నీ గేమ్ నువ్వాడకుండా వేరే వాళ్ల గురించి నీకెందుకు? నీకంటూ వ్యక్తిగతంగా ఏ అభిప్రాయాలు లేవా’’ అంటూ కూతుర్ని తీవ్ర స్థాయిలో అఖిల మందలించింది.
శివాని అరవకమ్మా అంటూ ఏడుస్తూ చెబుతున్నా సరే.. ఆమె ఆగలేదు. సదరు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది శివానికి బాగా డ్యామేజింగ్గా తయారైంది. కూతుర్ని సపోర్ట్ చేయాల్సిన తల్లి అంత సీరియస్గా తిట్టడం ఏంటని… ఇలా ఏ ‘బిగ్ బాస్’ షోలోనూ జరగలేదని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on December 30, 2020 12:37 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…