మార్కెట్ని అంచనా వేయడంలో దిట్ట అయిన దిల్ రాజు కరోనా టైమ్లో థియేటర్లు తెరిస్తే జనం థియేటర్లకు ఏమేరకు వస్తారనే దానిని అంచనా వేయలేకపోయాడు. అందుకే వకీల్ సాబ్ను సంక్రాంతి బరిలోంచి తప్పించి సమ్మర్కు వాయిదా వేసాడు. దిల్ రాజు కాస్త ఉత్సాహం చూపించినట్టయితే వకీల్ సాబ్ ఈపాటికి రిలీజ్కి రెడీ అయి వుండేది.
సంక్రాంతికి థియేటర్లు తెరిచినా కానీ ప్రేక్షకులు రారేమోననే భయంతో సమ్మర్కి వాయిదా వేయగా, ఇప్పుడు థియేటర్లకు రావడానికి జనం అస్సలేమీ భయపడడం లేదు. సగం టికెట్లే అమ్మాలంటూ నిబంధన వుందంటే కరోనా భయం ఇంకా వుందనే కదా. అయినా కానీ జనం పిల్లలను వేసుకుని మరీ థియేటర్లకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఏకంగా నాలుగైదు సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో ఒక్క భారీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం.
సంక్రాంతి అంటేనే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. అలాంటిది దిల్ రాజు రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల వకీల్ సాబ్ ఒక సదవకాశం మిస్ అయినట్టయింది. సగం సీట్లే అమ్మాలనే రూల్ ఇప్పుడు అమల్లో వున్నా కానీ సిటీల్లో తప్ప మిగతా చోట్ల అది అమలు కావడం లేదు. పైగా భారీ చిత్రాలకు టికెట్ రేట్లు, రోజుకి షోలు పెంచుకునే వెసులుబాటు వుండనే వుంది. కాస్త ముందు చూపు చూపించి చొరవ చేసినట్టయితే వకీల్ సాబ్కి సంక్రాంతి సీజన్లో కాంపిటీషనే లేని ఫ్రీ రైడ్ దొరికి వుండేది.
This post was last modified on December 29, 2020 2:34 pm
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…