మార్కెట్ని అంచనా వేయడంలో దిట్ట అయిన దిల్ రాజు కరోనా టైమ్లో థియేటర్లు తెరిస్తే జనం థియేటర్లకు ఏమేరకు వస్తారనే దానిని అంచనా వేయలేకపోయాడు. అందుకే వకీల్ సాబ్ను సంక్రాంతి బరిలోంచి తప్పించి సమ్మర్కు వాయిదా వేసాడు. దిల్ రాజు కాస్త ఉత్సాహం చూపించినట్టయితే వకీల్ సాబ్ ఈపాటికి రిలీజ్కి రెడీ అయి వుండేది.
సంక్రాంతికి థియేటర్లు తెరిచినా కానీ ప్రేక్షకులు రారేమోననే భయంతో సమ్మర్కి వాయిదా వేయగా, ఇప్పుడు థియేటర్లకు రావడానికి జనం అస్సలేమీ భయపడడం లేదు. సగం టికెట్లే అమ్మాలంటూ నిబంధన వుందంటే కరోనా భయం ఇంకా వుందనే కదా. అయినా కానీ జనం పిల్లలను వేసుకుని మరీ థియేటర్లకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఏకంగా నాలుగైదు సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో ఒక్క భారీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం.
సంక్రాంతి అంటేనే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. అలాంటిది దిల్ రాజు రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల వకీల్ సాబ్ ఒక సదవకాశం మిస్ అయినట్టయింది. సగం సీట్లే అమ్మాలనే రూల్ ఇప్పుడు అమల్లో వున్నా కానీ సిటీల్లో తప్ప మిగతా చోట్ల అది అమలు కావడం లేదు. పైగా భారీ చిత్రాలకు టికెట్ రేట్లు, రోజుకి షోలు పెంచుకునే వెసులుబాటు వుండనే వుంది. కాస్త ముందు చూపు చూపించి చొరవ చేసినట్టయితే వకీల్ సాబ్కి సంక్రాంతి సీజన్లో కాంపిటీషనే లేని ఫ్రీ రైడ్ దొరికి వుండేది.
This post was last modified on December 29, 2020 2:34 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…