మార్కెట్ని అంచనా వేయడంలో దిట్ట అయిన దిల్ రాజు కరోనా టైమ్లో థియేటర్లు తెరిస్తే జనం థియేటర్లకు ఏమేరకు వస్తారనే దానిని అంచనా వేయలేకపోయాడు. అందుకే వకీల్ సాబ్ను సంక్రాంతి బరిలోంచి తప్పించి సమ్మర్కు వాయిదా వేసాడు. దిల్ రాజు కాస్త ఉత్సాహం చూపించినట్టయితే వకీల్ సాబ్ ఈపాటికి రిలీజ్కి రెడీ అయి వుండేది.
సంక్రాంతికి థియేటర్లు తెరిచినా కానీ ప్రేక్షకులు రారేమోననే భయంతో సమ్మర్కి వాయిదా వేయగా, ఇప్పుడు థియేటర్లకు రావడానికి జనం అస్సలేమీ భయపడడం లేదు. సగం టికెట్లే అమ్మాలంటూ నిబంధన వుందంటే కరోనా భయం ఇంకా వుందనే కదా. అయినా కానీ జనం పిల్లలను వేసుకుని మరీ థియేటర్లకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఏకంగా నాలుగైదు సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో ఒక్క భారీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం.
సంక్రాంతి అంటేనే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. అలాంటిది దిల్ రాజు రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల వకీల్ సాబ్ ఒక సదవకాశం మిస్ అయినట్టయింది. సగం సీట్లే అమ్మాలనే రూల్ ఇప్పుడు అమల్లో వున్నా కానీ సిటీల్లో తప్ప మిగతా చోట్ల అది అమలు కావడం లేదు. పైగా భారీ చిత్రాలకు టికెట్ రేట్లు, రోజుకి షోలు పెంచుకునే వెసులుబాటు వుండనే వుంది. కాస్త ముందు చూపు చూపించి చొరవ చేసినట్టయితే వకీల్ సాబ్కి సంక్రాంతి సీజన్లో కాంపిటీషనే లేని ఫ్రీ రైడ్ దొరికి వుండేది.
This post was last modified on December 29, 2020 2:34 pm
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…