మార్కెట్ని అంచనా వేయడంలో దిట్ట అయిన దిల్ రాజు కరోనా టైమ్లో థియేటర్లు తెరిస్తే జనం థియేటర్లకు ఏమేరకు వస్తారనే దానిని అంచనా వేయలేకపోయాడు. అందుకే వకీల్ సాబ్ను సంక్రాంతి బరిలోంచి తప్పించి సమ్మర్కు వాయిదా వేసాడు. దిల్ రాజు కాస్త ఉత్సాహం చూపించినట్టయితే వకీల్ సాబ్ ఈపాటికి రిలీజ్కి రెడీ అయి వుండేది.
సంక్రాంతికి థియేటర్లు తెరిచినా కానీ ప్రేక్షకులు రారేమోననే భయంతో సమ్మర్కి వాయిదా వేయగా, ఇప్పుడు థియేటర్లకు రావడానికి జనం అస్సలేమీ భయపడడం లేదు. సగం టికెట్లే అమ్మాలంటూ నిబంధన వుందంటే కరోనా భయం ఇంకా వుందనే కదా. అయినా కానీ జనం పిల్లలను వేసుకుని మరీ థియేటర్లకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఏకంగా నాలుగైదు సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో ఒక్క భారీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం.
సంక్రాంతి అంటేనే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. అలాంటిది దిల్ రాజు రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల వకీల్ సాబ్ ఒక సదవకాశం మిస్ అయినట్టయింది. సగం సీట్లే అమ్మాలనే రూల్ ఇప్పుడు అమల్లో వున్నా కానీ సిటీల్లో తప్ప మిగతా చోట్ల అది అమలు కావడం లేదు. పైగా భారీ చిత్రాలకు టికెట్ రేట్లు, రోజుకి షోలు పెంచుకునే వెసులుబాటు వుండనే వుంది. కాస్త ముందు చూపు చూపించి చొరవ చేసినట్టయితే వకీల్ సాబ్కి సంక్రాంతి సీజన్లో కాంపిటీషనే లేని ఫ్రీ రైడ్ దొరికి వుండేది.
This post was last modified on December 29, 2020 2:34 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…