Movie News

ఆమిర్ ఖాన్ ‘వాష్ రూమ్’ వీడియో వైరల్

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్టేజ్ ఎక్కినా.. మైక్ అందుకున్నా ఎంత సరదాగా ప్రవర్తిస్తారో.. మాట్లాడతారో తెలిసిందే. తాజాగా ఆయన ఒక స్టేజ్ మీద తనదైన శైలిలో చిలిపితనం ప్రదర్శించారు. మాట్లాడుతూ మాట్లాడుతూ తనకు మూత్రం వస్తోంది అని చెప్పి స్టేజ్ దిగి వాష్ రూంకి పరుగులు పెట్టారు.

ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఏక్ దిన్ మూవీకి సంబంధించిన ఈవెంట్లో ఈ సరదా సంఘటన జరిగింది. స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. ఉన్నట్లుండి ఆమిర్ రెండు నిమిషాలు అనుమతి ఇస్తారా అని నిర్వాహకులను అడిగాడు. తర్వాత తనకు పాస్ వస్తోంది అని సంజ్ఞ చేసిన ఆయన వాష్ రూంకి వెళ్ళొస్తా అని చెప్పి స్టేజ్ దిగి పరుగులు పెట్టారు. దీంతో ఆడిటోరియం నవ్వుల్లో మునిగిపోయింది.

ఐతే ఈ ఘటనతో అందరినీ నవ్వించిన ఆమిర్ అంతకుముందు.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
తన కుమారుడు జునైద్ ఖాన్, సాయిపల్లవి జంటగా నటించిన ఏక్ దిన్ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి ఆమిర్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ముంబైలోని ఎస్ఎన్డీటీ కాలేజీలో నిర్వహించిన ‘ఏక్ దిన్ కి మెహఫిల్’ అనే మ్యూజికల్ ఈవెంట్‌లో తెరపై తన కొడుకును చూస్తూ అమీర్ ఖాన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

ఆమిర్ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా.. పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయనను ఓదారుస్తూ కనిపించింది. ఆ తర్వాత వేదికపైకి వచ్చిన ఆమిర్ తన కొడుకు గురించి ఎక్కువ మాట్లాడలేదు. సాయిపల్లవిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం మన దేశంలోనే అత్యుత్తమ నటి సాయిపల్లవి అని అన్నారు.ఆమె ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ కొనియాడారు. ఏక్ దిన్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు జునైద్ తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడే ఆధారంగా తెరకెక్కిన లవ్ యాపా చిత్రంలో నటించగా అది మంచి ఫలితాన్ని అందుకోలేక పోయింది.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

25 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

11 hours ago