80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు లాంటి చిత్రాలతో ఒక దశలో టాప్-4 హీరోలకు గట్టి పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నారు రాజశేఖర్. కానీ తర్వాత సరైన సినిమాలు చేయకపోవడం, రీమేక్ల ట్రెండ్ ముగిశాక కూడా వాటినే పట్టుకుని వేలాడడంతో ఈ సీనియర్ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి.
చాలా ఏళ్ల తర్వాత గరుడవేగతో హిట్టు కొట్టినా.. దాన్ని తర్వాత నిలబెట్టుకోలేకపోయారు. దీంతో జనం మళ్లీ ఆయన్ని మరిచిపోయారు. ఐతే చాలామంది సీనియర్ హీరోల్లాగే చివరికి రాజశేఖర్ క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అయ్యారు. కొన్నేళ్ల ముందు ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో స్పెషల్ రోల్ చేయగా.. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఆ పాత్ర జనం దృష్టిలో పడలేదు. దీంతో మళ్లీ కెరీర్లో గ్యాప్ తప్పలేదు.
ఈ విరామం తర్వాత ఇటీవల బైకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజశేఖర్. ఈ సినిమకు పాజిటివ్ టాక్, రివ్యూలు వచ్చాయి. రాజశేఖర్ చేసిన సునీల్ నారాయణ్ పాత్ర గురించి, అందులో ఆయన పెర్ఫామెన్స్ గురించి అందరూ పాజిటివ్గా మాట్లాడారు. సటిల్ పెర్ఫామెన్స్తో ఆ పాత్రను పండించారు రాజశేఖర్. కాకపోతే సినిమా అనుకున్నంతగా ఆడలేదు. వీకెండ్ వరకు సందడి చేసి తర్వాత చల్లబడిపోయింది. మంచి సినిమా అని పేరొచ్చిందే తప్ప కమర్షియల్ సక్సెస్ కాలేదు బైకర్. కానీ సినిమా హిట్ కానపుడు ఎవరెంత కష్టపడినా పెద్దగా ప్రయోజనం ఉండదు.
రాజశేఖర్ స్పెషల్ రోల్స్ చేసిన రెండు సినిమాలూ నిరాశకు గురి చేసిన నేపథ్యంలో మున్ముందు ఆయన కెరీర్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా ఆయన పెర్ఫామెన్స్కు వచ్చిన పేరును మాత్రమే గుర్తించి టాలీవుడ్ ఫిలిం మేకర్స్ అవకాశాలిస్తారేమో చూడాలి. నిజానికి తెలుగులో క్యారెక్టర్, విలన్ పాత్రలు చేసే నటుల కొరత ఉంది. ఆ లోటును తీర్చగల వాళ్లలో రాజశేఖర్ ఒకరు. మరి ఆయన్ని టాలీవుడ్ ఎంతమేర ఉపయోగించుకుంటుందో చూడాలి.
This post was last modified on April 24, 2026 1:32 pm
ఇంకా షూటింగ్ మొదలుకుండానే కేవలం ప్రీ లుక్ పోస్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సోషల్…
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ఏపీ తెలంగాణలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. బడా సంస్థ పంపిణి హక్కులు…
సందీప్ కిషన్.. హిట్లు ఫ్లాపుల కంటే ముందుగా గుర్తొచ్చేది ఈ హీరో చేసే ప్రయోగాలు. 16 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా…
భారతదేశంలో మరణశిక్ష అమలు విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఉరి తీయడానికి బదులుగా ప్రాణాలు తీసేందుకు తక్కువ నొప్పిని…
2014 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలలో దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఒకటి.…
టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు కలిసి ఏపీలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు ఈ…