మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి వస్తుందో చెప్పలేదు. నాలుగని ఒకరు ఇరవై అయిదని మరొకరు రెండు ఆప్షన్లు ప్రచారంలోకి తెచ్చారు. టాక్సిక్ ఒకవేళ వాయిదా పడే పక్షంలో ఆ డేట్ తీసుకుని జూన్ 4 లాక్ చేయాలనే ఆలోచనలో వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు. తేదీ సంగతి ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జరిగిపోతున్నాయి. మెయిన్ సెంటర్స్ డిస్ట్రిబ్యూటర్లు లాకైపోయారు.
పెద్దిని కాసేపు పక్కనపెడితే అసలు విశ్వంభర ఎందుకింత సైలెంట్ ఉందో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. విఎఫ్ఎక్స్ సమస్యని చెప్పి 2024 నుంచి దాని మీద వర్క్ చేస్తున్నారు. ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ ఇప్పటిదాకా పని ఎంతదాక వచ్చిందో చెప్పలేదు. ఈలోగా దర్శకుడు వశిష్ఠ ఇంకోవైపు బాలకృష్ణకో కథ చెప్పి ఓకే చేయించుకున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉండాల్సిన తను వేరే ట్రయిల్స్ లో ఉన్నాడానేది ఫ్యాన్స్ డౌట్.
దీనికి క్లారిటీ రావాలంటే ముందు చరణ్ డేట్ డిసైడ్ కావాలి. పెద్దికి విశ్వంభరకు కనీస గ్యాప్ ఉండాలనేది చిరంజీవి సూచన. అసలే యువి క్రియేషన్స్ ఇబ్బందుల్లో ఉందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. ఘాటీ డిజాస్టర్ అయ్యింది. కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ అనిపించుకున్నా తడిసిపోయే రేంజ్ లో కనకవర్షం కురవలేదు. బైకర్ ని అందరూ ఆకాశానికి ఎత్తే రేంజ్ లో పొగిడినా రెండు వారాల తర్వాత కూడా బ్రేక్ఈవెన్ చేరుకోలేదు. ఇప్పుడు విశ్వంభర సమస్య తీరాల్సి ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిల్యూర్ తో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ కి ఊరట కలిగించాల్సింది ఈ రెండు సినిమాలే. ముఖ్యంగా పెద్ది మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. విశ్వంభర ప్రస్తుతానికి హైప్ తగ్గిపోయినట్టు అనిపిస్తున్నా రిపేర్ల తర్వాత అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అంతర్గత వర్గాల సమాచారం. ఇప్పటికైతే రీ రికార్డింగ్ కోసం కీరవాణికి ఇంటిమేషన్ వెళ్లలేదట. ఫైనల్ కాపీ సిద్ధం కాగానే కబురు పెడతారని తెలిసింది. ఎలా చూసినా విశ్వంభర జూలైలో రావడం దాదాపు ఫిక్స్.
This post was last modified on April 16, 2026 9:48 pm
నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు…
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. పట్టుమని ఒక్కగంట కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల…
ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం 15 వేల రూపాయల గిఫ్ట్…
సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్లు లేరని…
భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో అల్లు అర్జున్ 'రాకా' టాప్ 3లో…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.…