కొన్ని నెలల కిందట సాచి అనే మేటి దర్శకుడిని కోల్పోయింది సినీ పరిశ్రమ. ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన అయ్యప్పనుం కోషీయుం దర్శకుడతను. అంతకుముందు అతను రచయితగా డ్రైవింగ్ లైసెన్స్ సహా కొన్ని క్లాసిక్స్ అందించాడు. అలాంటి దర్శకుడు గుండెపోటుతో చనిపోవడం మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నింపింది.
ఇప్పుడు ఆ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. అతడి పేరు.. అనిల్ నెడుమంగడ్. ఇతను కూడా అయ్యప్పనుం కోషీయుం సినిమాతో ముడిపడ్డ వాడే కావడం గమనార్హం. ఆ చిత్రం చూసిన వాళ్లకు ఎస్పీ పాత్రలో చక్కటి నటన కనబరిచిన నటుణ్ని మరిచిపోలేరు. ఆ నటుడే అనిల్ నెడుమంగడ్. ఇంతకుముందు కమ్మటిపాదం, పావడ లాంటి సినిమాలతో సత్తా చాటాడు అనిల్. అయ్యప్పునుం కోషీయుం అతడికి చాలా పేరు తెచ్చింది.
శుక్రవారం సాచి పుట్టిన రోజు. దాన్ని పురస్కరించుకుని ఉదయం ఒక భావోద్వేగ ఫేస్ బుక్ పోస్టు కూడా పెట్టాడు అనిల్. తర్వాత కొన్ని గంటలకే అతను చనిపోయాడు. జోసెఫ్ ఫేమ్ జోజు జార్జ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ కోసం అనిల్.. తొడుపుళ ప్రాంతంలో ఉన్నాడు. అదే ప్రాంతంలో ఉన్న మలంకర డ్యామ్ దగ్గరికి స్నేహితులతో విహారానికి వెళ్లాడు. అక్కడ నీటిలో దిగి స్నానం చేస్తున్న సమయంలో అదుపు తప్పి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఇంత మంచి నటుడు ఇలా అర్థంతరంగా తనువు చాలించడం మలయాళ సినీ పరిశ్రమకు పెద్ద షాక్. ఒక గొప్ప సినిమాలో భాగమైన ఇద్దరు ఇలా స్వల్ప వ్యవధిలో చనిపోవడం.. అది కూడా ముందు చనిపోయిన సాచి పుట్టిన రోజు నాడు అతడి గురించి పోస్టు పెట్టిన కొన్ని గంటల్లో అనిల్ తనువు చాలించడం అక్కడి సినీ జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు.
This post was last modified on December 25, 2020 10:36 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…