కొన్ని నెలల కిందట సాచి అనే మేటి దర్శకుడిని కోల్పోయింది సినీ పరిశ్రమ. ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన అయ్యప్పనుం కోషీయుం దర్శకుడతను. అంతకుముందు అతను రచయితగా డ్రైవింగ్ లైసెన్స్ సహా కొన్ని క్లాసిక్స్ అందించాడు. అలాంటి దర్శకుడు గుండెపోటుతో చనిపోవడం మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నింపింది.
ఇప్పుడు ఆ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. అతడి పేరు.. అనిల్ నెడుమంగడ్. ఇతను కూడా అయ్యప్పనుం కోషీయుం సినిమాతో ముడిపడ్డ వాడే కావడం గమనార్హం. ఆ చిత్రం చూసిన వాళ్లకు ఎస్పీ పాత్రలో చక్కటి నటన కనబరిచిన నటుణ్ని మరిచిపోలేరు. ఆ నటుడే అనిల్ నెడుమంగడ్. ఇంతకుముందు కమ్మటిపాదం, పావడ లాంటి సినిమాలతో సత్తా చాటాడు అనిల్. అయ్యప్పునుం కోషీయుం అతడికి చాలా పేరు తెచ్చింది.
శుక్రవారం సాచి పుట్టిన రోజు. దాన్ని పురస్కరించుకుని ఉదయం ఒక భావోద్వేగ ఫేస్ బుక్ పోస్టు కూడా పెట్టాడు అనిల్. తర్వాత కొన్ని గంటలకే అతను చనిపోయాడు. జోసెఫ్ ఫేమ్ జోజు జార్జ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ కోసం అనిల్.. తొడుపుళ ప్రాంతంలో ఉన్నాడు. అదే ప్రాంతంలో ఉన్న మలంకర డ్యామ్ దగ్గరికి స్నేహితులతో విహారానికి వెళ్లాడు. అక్కడ నీటిలో దిగి స్నానం చేస్తున్న సమయంలో అదుపు తప్పి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఇంత మంచి నటుడు ఇలా అర్థంతరంగా తనువు చాలించడం మలయాళ సినీ పరిశ్రమకు పెద్ద షాక్. ఒక గొప్ప సినిమాలో భాగమైన ఇద్దరు ఇలా స్వల్ప వ్యవధిలో చనిపోవడం.. అది కూడా ముందు చనిపోయిన సాచి పుట్టిన రోజు నాడు అతడి గురించి పోస్టు పెట్టిన కొన్ని గంటల్లో అనిల్ తనువు చాలించడం అక్కడి సినీ జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…