2020 డిసెంబరు 25.. టాలీవుడ్లో ఇది ఒక కీలకమైన రోజు అనడంలో సందేహం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు తొమ్మిది నెలల పాటు మూత పడ్డ థియేటర్లు ఈ మధ్యే తెరుచుకున్నాయి. పున:ప్రారంభం తర్వాత కూడా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఐతే ఎట్టకేలకు వాటిలో కళను తీసుకొచ్చే సినిమా రిలీజవుతోంది.
సాయిధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు రూపొందించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ శుక్రవామే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇన్నాళ్లూ థియేటర్లలో సినిమాల ప్రదర్శించడంపై ఒక దోబూచులాట నడిచింది. 50 శాతం ఆక్యుపెన్సీతో ఏం రిలీజ్ చేస్తాం.. రిలీజ్ చేసినా థియేటర్లకు వచ్చి జనం చూస్తారా అన్న అనుమానంతో నిర్మాతలు వెనుకంజ వేస్తే.. కొత్త సినిమాలు లేకుంటే జనం ఏం చూస్తారు, అవి వస్తే ఆటోమేటిగ్గా జనాలు థియేటర్లకు వస్తారు అన్నట్లుగా థియేటర్లు వెనుకంజలో ఉన్నాయి. వేరే కారణాలు కూడా తోడై పూర్తి స్థాయిలో థియేటర్లను తెరవలేదు.
ఐతే ఈ అనుమానాల మధ్యే ‘సోలో బ్రతుకే సో బెటర్’ను క్రిస్మస్ రేసులో నిలిపారు. ఐతే అనుమానాలను పటా పంచలు చేస్తూ ఈ చిత్రానికి మంచి స్థాయిలోనే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సినిమాకు క్రేజ్ బాగానే ఉంది. లాక్ డౌన్ తర్వాత రిలీజవుతున్న తొలి పేరున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ జనాలకు దీనిపై భారీ ఆశలే ఉన్నాయి.
థియేటర్లలో తెలుగు సినిమా రీస్టార్ట్గా పేర్కొంటూ ఈ చిత్రానికి ఇండస్ట్రీ ప్రముఖులందరూ తమ వంతుగా సపోర్ట్ ఇస్తున్నారు. దాన్ని తమ వంతుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ రకంగా ‘సోలో..’కు అన్నీ బాగానే కలిసొచ్చాయి. కానీ అన్నింటికంటే మించి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కీలకం. అది లేకుంటే ఎంత ప్రమోట్ చేసినా, రిలీజ్ ముంగిట ఎంత హైప్ వచ్చినా వేస్ట్. మరి ఆ విషయంలో తేజు సినిమా ఏం చేస్తుందన్నది కీలకం. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మంచి వసూళ్లు రాబట్టి టాలీవుడ్లో కాన్ఫిడెన్స్ నింపి మున్ముందు మరిన్ని కొత్త సినిమాలు రిలీజవుతాయనడంలో సందేహం లేదు.
This post was last modified on December 25, 2020 12:51 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…