2020 డిసెంబరు 25.. టాలీవుడ్లో ఇది ఒక కీలకమైన రోజు అనడంలో సందేహం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు తొమ్మిది నెలల పాటు మూత పడ్డ థియేటర్లు ఈ మధ్యే తెరుచుకున్నాయి. పున:ప్రారంభం తర్వాత కూడా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఐతే ఎట్టకేలకు వాటిలో కళను తీసుకొచ్చే సినిమా రిలీజవుతోంది.
సాయిధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు రూపొందించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ శుక్రవామే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇన్నాళ్లూ థియేటర్లలో సినిమాల ప్రదర్శించడంపై ఒక దోబూచులాట నడిచింది. 50 శాతం ఆక్యుపెన్సీతో ఏం రిలీజ్ చేస్తాం.. రిలీజ్ చేసినా థియేటర్లకు వచ్చి జనం చూస్తారా అన్న అనుమానంతో నిర్మాతలు వెనుకంజ వేస్తే.. కొత్త సినిమాలు లేకుంటే జనం ఏం చూస్తారు, అవి వస్తే ఆటోమేటిగ్గా జనాలు థియేటర్లకు వస్తారు అన్నట్లుగా థియేటర్లు వెనుకంజలో ఉన్నాయి. వేరే కారణాలు కూడా తోడై పూర్తి స్థాయిలో థియేటర్లను తెరవలేదు.
ఐతే ఈ అనుమానాల మధ్యే ‘సోలో బ్రతుకే సో బెటర్’ను క్రిస్మస్ రేసులో నిలిపారు. ఐతే అనుమానాలను పటా పంచలు చేస్తూ ఈ చిత్రానికి మంచి స్థాయిలోనే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సినిమాకు క్రేజ్ బాగానే ఉంది. లాక్ డౌన్ తర్వాత రిలీజవుతున్న తొలి పేరున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ జనాలకు దీనిపై భారీ ఆశలే ఉన్నాయి.
థియేటర్లలో తెలుగు సినిమా రీస్టార్ట్గా పేర్కొంటూ ఈ చిత్రానికి ఇండస్ట్రీ ప్రముఖులందరూ తమ వంతుగా సపోర్ట్ ఇస్తున్నారు. దాన్ని తమ వంతుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ రకంగా ‘సోలో..’కు అన్నీ బాగానే కలిసొచ్చాయి. కానీ అన్నింటికంటే మించి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కీలకం. అది లేకుంటే ఎంత ప్రమోట్ చేసినా, రిలీజ్ ముంగిట ఎంత హైప్ వచ్చినా వేస్ట్. మరి ఆ విషయంలో తేజు సినిమా ఏం చేస్తుందన్నది కీలకం. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మంచి వసూళ్లు రాబట్టి టాలీవుడ్లో కాన్ఫిడెన్స్ నింపి మున్ముందు మరిన్ని కొత్త సినిమాలు రిలీజవుతాయనడంలో సందేహం లేదు.
This post was last modified on December 25, 2020 12:51 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…