చాలా తక్కువ సమయంలో పెద్ద రేంజికి ఎదిగిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. ఒక దశ దాటాక ఆ రేంజికి తగ్గ సినిమాలు అందించలేకపోయాడు. ఓ మంచి విజయం కోసం చాలా ఏళ్ల నుంచి అతను ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది ‘కింగ్డమ్’తో అతడి ఆశ నెరవేరుతుందనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది.
ఐతే కొత్త ఏడాదిలో ఒకటికి రెండు ప్రామిసింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్. అందులో ఒకటి ‘రౌడీ జనార్దన’. ఆ చిత్రం డిసెంబరులో విడుదల కాబోతోంది. దాని కంటే ముందు అతడి మరో సినిమా ‘రణబాలి’ ప్రేక్షకులను పలకరించబోతోంది.
నిన్ననే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబరు 11నే రిలీజ్ అని కూడా ప్రకటించారు. స్వాతంత్ర్యానికి పూర్వం రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ వారి మీద వీరోచితంగా పోరాడిన ఒక అన్ సంగ్ హీరో కథ ఇదని తెలుస్తోంది.
నిన్న రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఈ గ్లింప్స్ను ఏఐ వాడి క్రియేట్ చేశారంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ మధ్య సినిమా గురించి ఒక కబురు తెలిస్తే చాలు.. ఏఐ ద్వారా కథలనే క్రియేట్ చేసేస్తున్నారు నెటిజన్లు.
‘రణబాలి’ గ్లింప్స్ను కూడా అలాగే చేశారంటూ దాని మీద సెటైర్లు వేస్తున్నారు కొందరు. దీనిపై దర్శకుడు రాహుల్ సంకృత్యన్ స్పందించాడు. ‘రణబాలి’ వీడియోను ఏఐతో తయారు చేయలేదని రాహుల్ స్పష్టం చేశాడు. ప్రతి ఫ్రేమ్ను పాత పద్ధతుల్లోనే ఎంతో కష్టపడి డిజైన్ చేశామని.. ఈ గ్లింప్స్ను సిద్ధం చేయడానికి తమ బృందానికి నెలల సమయం పట్టిందని అతను వెల్లడించాడు.
ఈ రోజుల్లో ఏది ఒరిజినలో, ఏది ఏఐనో కనిపెట్టడం కష్టమైపోతున్న నేపథ్యంలో.. ఎంతో కష్టపడి చేసిన పనికి కూడా గుర్తింపు రాని పరిస్థితి తలెత్తుతోంది. రాహుల్ ఎంత కమిట్మెంట్ ఉన్న దర్శకుడో అతను తీసిన ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలను చూస్తే అర్థమవుతుంది.
కాబట్టి ఎంతో కష్టపడి చేసిన వీడియోను ఏఐ గాటన కట్టి తక్కువ చేయడం కరెక్ట్ కాదు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రష్మిక మందన్నా కథానాయికగా చేస్తోంది. ఇందులో ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 27, 2026 10:19 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…