సాయిధరమ్ తేజ్ ఇప్పుడు టాలీవుడ్లో పేరున్న స్టార్లలో ఒకడు. అతడి పేరు మీద 25-30 కోట్ల మధ్య మార్కెట్ జరుగుతుంది ఓ సినిమా మీద. ప్రస్తుతం అతను ప్రతిరోజూ పండగే లాంటి సూపర్హిట్ తర్వాత ఊపుమీదున్నాడు. తన కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటర్ మీద మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి హీరో కెరీర్ ఆరంభంలో దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. పేరున్న కుటుంబం, పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కెరీర్ ఆరంభంలో అతడికి కలిసి రాలేదు. తొలి సినిమా రేయ్ ఒక పట్టాన పూర్తి కాలేదు. విడుదల కూడా బాగా అలస్యమైంది. రిలీజయ్యాక దాని ఫలితమూ తెలిసిన సంగతే.
ఇక దాని కంటే ముందు విడుదలైన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రానికి కూడా కష్టాలు తప్పలేదు. ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో ఉండగా అందులో కీలక పాత్ర చేస్తున్న శ్రీహరి చనిపోయాడు. తర్వాత జగపతిబాబును ఆ పాత్రకు తీసుకున్నారు. సినిమా పూర్తి చేసి ఎలాగోలా రిలీజ్ చేశారు. అది హిట్టవడంతో తేజు దశ తిరిగింది.
కానీ శ్రీహరి చనిపోవడం వల్ల సినిమా మధ్యలో ఆగిపోయే పరిస్థితుల్లో తన పరిస్థితి దారుణమంటూ ఒక జాతీయ ఇంగ్లిష్ మీడియా సంస్థకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తేజు. ఆ సమయంలో మెగాస్టార్ అభిమాని ఒకరు తనకు ఫోన్ చేసి సినిమాలు ఆపేయమన్నాడన్నాడు. ఇప్పటి వరకు చేసింది చాలు.. నీకు సినిమాల్లో కలిసొచ్చేలా లేదు.. ఇక సినిమాలు ఆపేయి అని అతను తనకు ఖరాఖండిగా చెప్పేసినట్లు తేజు వెల్లడించాడు.
ఐతే తాను చేస్తున్న రెండు సినిమాలూ పూర్తి చేసి.. అవి విడుదలయ్యాక తాను పనికి రానని ఫీలైతే కచ్చితంగా సినిమాలు మానేస్తానని ఆ అభిమానికి ఓపిగ్గానే చెప్పినట్లు తేజు చెప్పాడు. ఐతే పిల్లా నువ్వు లేని జీవితం విడుదలై హిట్టవడం, తన నటనకు ప్రశంసలు దక్కడంతో అదే అభిమాని మళ్లీ తనకు ఫోన్ చేసి సారీ చెప్పినట్లు తేజు వెల్లడించాడు.
This post was last modified on December 15, 2020 10:44 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…