ఒకప్పుడు వైభవం చూసిన స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల.. గత కొన్నేళ్లుగా హీరోలు, నిర్మాతలు దొరక్క ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణుతో సినిమా చేద్దామన్నా కూడా అది సెట్ కాలేదు. చివరికి గోపీచంద్తో కష్టపడి ‘విశ్వం’ సినిమా సెట్ చేసుకున్నాడు. దానికీ ఇబ్బందులు తప్పలేదు. మధ్యలో చేతులు మారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సౌజన్యంతో పూర్తయిన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
దీంతో మళ్లీ వైట్ల కెరీర్లో గ్యాప్ తప్పలేదు. కొన్ని ప్రయత్నాలు చేసి ఫెయిలైన వైట్ల.. ఎట్టకేలకు తన కొత్త చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. సంక్రాంతికి రిలీజైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో సక్సెస్ అందుకున్న శర్వానంద్.. వైట్ల కొత్త చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా శర్వానే వెల్లడించాడు.
‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ మీట్లో తన కొత్త చిత్రం వైట్లతో ఉంటుందని శర్వా అనౌన్స్ చేశాడు. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉండని వైట్ల.. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా చూసి శర్వా అండ్ టీంను కొనియాడుతూ పోస్టు పెట్టినపుడే.. వీళ్లిద్దరి కలయికలో సినిమా రాబోతోందా అన్న సందేహాలు కలిగాయి. ఇప్పుడు శర్వా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు.
ఇంతకుముందు వైట్లతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. వచ్చే సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు కూడా శర్వా వెల్లడించాడు. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో సంక్రాంతి హ్యాట్రిక్ హీరోగా నిలిచిన శర్వా.. తనకు బాగా కలిసొచ్చిన అదే సీజన్లో తర్వాతి సినిమాను తీసుకురాబోతున్నాడు. ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన వైట్ల.. శర్వాతో తన మార్కు సినిమా తీసి మళ్లీ ప్రేక్షకుల మెప్పు పొందుతాడేమో చూడాలి మరి.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…