బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి రూ.500 కోట్ల భారీ బడ్జెట్లో రామాయణం సినిమా తీయబోతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటన చేసి కొన్నేళ్లవుతోంది. కానీ ఆ దిశగా అంత వేగంగా ఏమీ అడుగులు పడట్లేదు.
వీరి రామాయణం పట్టాలెక్కడానికి ముందే అదే కథ స్ఫూర్తితో ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు వారి రామాయణం ఆగిపోతుందేమో అని వార్తలొచ్చాయి. కానీ తమ ప్రాజెక్టు విషయంలో అరవింద్ పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తోంది.
దంగల్ దర్శకుడు నితీశ్ తివారి డైరెక్షన్లో ఆయన రామాయణం తీయాలనుకుంటున్నారు. ఇందుకోసం వనరులు సమీకరిస్తూ నెమ్మదిగా ప్రి ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నారు.
సంపూర్ణ రామాయణ గాథను బహు భాషల్లో భారీగా తెరకెక్కించాలన్నది అరవింద్ బృంద ప్రణాళిక. కాగా తెలుగు వెర్షన్ కోసం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సాయాన్ని ఆయన తీసుకున్నారట. దీనికి స్క్రీన్ ప్లే రాయడంతో పాటు రచనా సహకారం కూడా త్రివిక్రమ్ అందిస్తున్నారట.
తన తర్వాతి సినిమాలకు స్క్రిప్టు రెడీ చేసుకుంటూనే రామాయణం పని కూడా చేస్తూ వస్తున్నారట త్రివిక్రమ్. అది ఓ కొలిక్కి వచ్చినట్లే అంటున్నారు. బన్నీ, అరవింద్లతో త్రివిక్రమ్కు మంచి అనుబంధమే ఉంది. ఈ అనుబంధం వల్లే ఈ ప్రాజెక్టులో త్రివిక్రమ్ భాగమయ్యాడంటున్నారు.
మరి రామాయణ కథకు త్రివిక్రమ్ ఎలాంటి టచ్ ఇచ్చాడన్నది ఆసక్తికరం. వచ్చే ఏడాది అయినా ఈ మెగా ప్రాజెక్టు పట్టాలెక్కుతుందేమో చూడాలి మరి.
This post was last modified on December 14, 2020 12:49 am
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…