బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి రూ.500 కోట్ల భారీ బడ్జెట్లో రామాయణం సినిమా తీయబోతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటన చేసి కొన్నేళ్లవుతోంది. కానీ ఆ దిశగా అంత వేగంగా ఏమీ అడుగులు పడట్లేదు.
వీరి రామాయణం పట్టాలెక్కడానికి ముందే అదే కథ స్ఫూర్తితో ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు వారి రామాయణం ఆగిపోతుందేమో అని వార్తలొచ్చాయి. కానీ తమ ప్రాజెక్టు విషయంలో అరవింద్ పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తోంది.
దంగల్ దర్శకుడు నితీశ్ తివారి డైరెక్షన్లో ఆయన రామాయణం తీయాలనుకుంటున్నారు. ఇందుకోసం వనరులు సమీకరిస్తూ నెమ్మదిగా ప్రి ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నారు.
సంపూర్ణ రామాయణ గాథను బహు భాషల్లో భారీగా తెరకెక్కించాలన్నది అరవింద్ బృంద ప్రణాళిక. కాగా తెలుగు వెర్షన్ కోసం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సాయాన్ని ఆయన తీసుకున్నారట. దీనికి స్క్రీన్ ప్లే రాయడంతో పాటు రచనా సహకారం కూడా త్రివిక్రమ్ అందిస్తున్నారట.
తన తర్వాతి సినిమాలకు స్క్రిప్టు రెడీ చేసుకుంటూనే రామాయణం పని కూడా చేస్తూ వస్తున్నారట త్రివిక్రమ్. అది ఓ కొలిక్కి వచ్చినట్లే అంటున్నారు. బన్నీ, అరవింద్లతో త్రివిక్రమ్కు మంచి అనుబంధమే ఉంది. ఈ అనుబంధం వల్లే ఈ ప్రాజెక్టులో త్రివిక్రమ్ భాగమయ్యాడంటున్నారు.
మరి రామాయణ కథకు త్రివిక్రమ్ ఎలాంటి టచ్ ఇచ్చాడన్నది ఆసక్తికరం. వచ్చే ఏడాది అయినా ఈ మెగా ప్రాజెక్టు పట్టాలెక్కుతుందేమో చూడాలి మరి.
This post was last modified on December 14, 2020 12:49 am
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…