ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించిన రాజాసాబ్ డిసెంబరు 5నే రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని ఈ నెల 9కి సినిమాను వాయిదా వేశారు. కానీ పండక్కి తెలుగు నుంచి మరో నాలుగు సినిమాలు బరిలో ఉండడం.. తమిళం నుంచి జననాయకుడు సినిమా వస్తుండడంతో ఈ చిత్రానికి థియేటర్ల సమస్య తప్పలేదు.
జననాయకుడు సినిమాకు తెలుగులో కూడా భారీగా స్క్రీన్లు ఇచ్చారు. మరోవైపు తమిళనాడు సహా దక్షిణాదిన మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ జననాయగన్ భారీగా రిలీజవడంతో ప్రభాస్ సినిమాకు కొంతమేరకు ఇబ్బందిగా మారింది. ఓవర్సీస్లో కూడా ఇదే పరిస్థితి. ఐతే ఇప్పుడు విజయ్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి. వ్యవహారం కోర్టుకు చేరింది. అక్కడా సత్వర ఉపశమనం దక్కట్లేదు.
ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే జనవరి 9న జననాయగన్ రిలీజవడం కష్టంగానే ఉంది. కోర్టు తీర్పును బట్టి కొత్త డేట్ ఖరారవుతుంది.
ఈ వీకెండ్లో జననాయగన్ రిలీజ్ కాకపోతే రాజాసాబ్ జాక్ పాట్ కొట్టినట్లే. వరల్డ్ వైడ్ సోలోగా సినిమా రిలీజవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జననాయగన్ కోసం అట్టిపెట్టిన స్క్రీన్లు కూడా ప్రభాస్ సినిమాకే దక్కుతాయి. దీని కంటే సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. తమిళనాడు, కర్ణాటక, కేరళలో రాజాసాబ్కు పోటీనే ఉండదు. కావాల్సినన్ని స్క్రీన్లు ఇస్తారు.
ఉత్తరాదిన కూడా వసూళ్ల పంట పండించుకోవడానికి అవకాశముంటుంది. ఓవర్సీస్లోనూ రాజాసాబ్కు ఎదురే ఉండదు. ముందు అనుకున్న దాని కంటే ఓపెనింగ్స్ భారీగా ఉండడం ఖాయం. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. తొలి వీకెండ్లోనే బయ్యర్లు పెట్టుబడిలో చాలా వరకు వెనక్కి రాబట్టుకోవడానికి అవకాశముంటుంది.
డిసెంబరులో రాజాసాబ్ రిలీజై ఉంటే.. దురంధర్ దెబ్బ దానిపై గట్టిగానే పడేది. ఇప్పుడు సంక్రాంతి పండక్కి తోడు.. పోటీలేని బాక్సాఫీస్ ఆ సినిమాకు బాగా కలిసొచ్చేదే. మరి ఈ అడ్వాంటేజీని ప్రభాస్-మారుతి ఏమేర సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.
This post was last modified on January 7, 2026 9:55 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…