చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ మీదే ఉన్నాయి. భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న గాల్వాన్ లోయలో.. ఐదేళ్ల కిందట ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ముందుగా భారత సైన్యాన్ని కవ్విస్తూ చైనా ఆర్మీ దాడి చేస్తే.. తక్కువమందే ఉన్నప్పటికీ ఇండియన్ సోల్జర్స్ వీరోచితంగా పోరాడారు.
ఇందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది దాకా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలోనే సల్మాన్ హీరోగా అపూర్వ లఖియా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ను రూపొందించాడు. ఇటీవలే దీని టీజర్ లాంచ్ అయింది. ఐతే దీనికి మిశ్రమ స్పందన లభించింది. టీజర్ చూశాక ఇంతకీ సల్మాన్ ఏ పాత్ర చేస్తున్నాడు అనే చర్చ మొదలైంది. దీనికి సమాధానం.. సంతోష్ బాబు అని తెలుస్తోంది. కొన్ని నెలల ముందే ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ టీజర్ చూసాక స్పష్టం అవుతుంది.
గాల్వాన్ లోయలో చైనా దాడి చేసినపుడు భారత సైనికులు చాలా తక్కువమందే ఉన్నారు. కాసేపటికే కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని మరో దళం అక్కడికి చేరుకుని చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడింది. ఈ ఎటాక్లో ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబును భారత ప్రభుత్వం మహావీర చక్ర పురస్కారంతో గౌరవించింది. సల్మాన్ ఈ పాత్రనే ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’లో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్తో ‘జంజీర్’ లాంటి డిజాస్టర్ తీసిన అపూర్వ లఖియా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ను రూపొందిస్తున్నాడు. దీని టీజర్ అయితే ఏమంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు.
ఈ సినిమా విషయమై చైనా ఆర్మీ స్పందించడం గమనార్హం. గాల్వాన్ ఎటాక్ సమయంలో తాము భారత భూభాగంలోకి వెళ్లలేదని.. ఇండియన్ ఆర్మీనే తమ ప్రాంతంలోకి వచ్చిందని.. తమ దేశానికి చెడ్డ పేరు తెచ్చేలా అవాస్తవాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని.. ఈ సినిమా తమ సైన్యం దృఢ సంకల్పాన్ని సడలించలేదని చైనా సైన్యాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ రంజాన్ కానుకగా వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on December 30, 2025 9:45 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…