చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ మీదే ఉన్నాయి. భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న గాల్వాన్ లోయలో.. ఐదేళ్ల కిందట ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ముందుగా భారత సైన్యాన్ని కవ్విస్తూ చైనా ఆర్మీ దాడి చేస్తే.. తక్కువమందే ఉన్నప్పటికీ ఇండియన్ సోల్జర్స్ వీరోచితంగా పోరాడారు.
ఇందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది దాకా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలోనే సల్మాన్ హీరోగా అపూర్వ లఖియా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ను రూపొందించాడు. ఇటీవలే దీని టీజర్ లాంచ్ అయింది. ఐతే దీనికి మిశ్రమ స్పందన లభించింది. టీజర్ చూశాక ఇంతకీ సల్మాన్ ఏ పాత్ర చేస్తున్నాడు అనే చర్చ మొదలైంది. దీనికి సమాధానం.. సంతోష్ బాబు అని తెలుస్తోంది. కొన్ని నెలల ముందే ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ టీజర్ చూసాక స్పష్టం అవుతుంది.
గాల్వాన్ లోయలో చైనా దాడి చేసినపుడు భారత సైనికులు చాలా తక్కువమందే ఉన్నారు. కాసేపటికే కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని మరో దళం అక్కడికి చేరుకుని చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడింది. ఈ ఎటాక్లో ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబును భారత ప్రభుత్వం మహావీర చక్ర పురస్కారంతో గౌరవించింది. సల్మాన్ ఈ పాత్రనే ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’లో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్తో ‘జంజీర్’ లాంటి డిజాస్టర్ తీసిన అపూర్వ లఖియా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ను రూపొందిస్తున్నాడు. దీని టీజర్ అయితే ఏమంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు.
ఈ సినిమా విషయమై చైనా ఆర్మీ స్పందించడం గమనార్హం. గాల్వాన్ ఎటాక్ సమయంలో తాము భారత భూభాగంలోకి వెళ్లలేదని.. ఇండియన్ ఆర్మీనే తమ ప్రాంతంలోకి వచ్చిందని.. తమ దేశానికి చెడ్డ పేరు తెచ్చేలా అవాస్తవాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని.. ఈ సినిమా తమ సైన్యం దృఢ సంకల్పాన్ని సడలించలేదని చైనా సైన్యాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ రంజాన్ కానుకగా వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…