బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో రోజు కూడా తెల్లవారుఝాము, అర్ధరాత్రి షోలు వేసే స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. కేవలం పుష్ప 2, యానిమల్ లాంటివి మాత్రమే ఈ అరుదైన ఘనత దక్కించుకున్నాయి. అసలు విశేషం ఇది కాదు. ఎంత పెద్ద హిట్ అయిన సినిమాకైనా రెండో శుక్రవారం పెద్ద ఎత్తున వసూళ్లు దక్కవు. కానీ దురంధర్ ఆ రికార్డును సైతం బ్రేక్ చేసింది. సెకండ్ ఫ్రైడే 34 కోట్ల 70 లక్షల కలెక్షన్ నమోదు చేసి ఈ రికార్డు అందుకున్న తొలి ఇండియన్ మూవీగా మైలురాయి అందుకుంది.
ఇప్పటిదాకా ఈ ఘనత 27 కోట్ల 50 లక్షలతో పుష్ప టూ పేరు మీద ఉంది. దాన్ని పెద్ద మార్జిన్ తో దాటేయడం చూసి ట్రేడ్ నివ్వెరపోతోంది. రెండో వీకెండ్ పూర్తి కాకుండానే 300 కోట్లను దాటేసిన దురంధర్ నాలుగు వందల కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టేందుకు పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని దూకుడు మాములుగా లేదు. ఆశ్చర్యకరంగా హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో అఖండ 2 కన్నా వేగంగా దురంధర్ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ ఉదాహరణ చాలు ఎంతగా ఈ మూవీ చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవడానికి. సోషల్ మీడియా మద్దతు ఈ విషయంలో చాలా బలంగా పని చేస్తోంది.
చూస్తుంటే ఫైనల్ రన్ అయ్యేలోపు అయిదు వందల కోట్లు దాటేయడం లాంఛనమే అనిపిస్తోంది. సక్సెస్ వచ్చాక టీమ్ ఫుల్ యాక్టివ్ అయిపోయింది. మాధవన్ అడిగినవాళ్లందరికీ ఇంటర్వ్యూలు ఇస్తుండగా దర్శకుడు ఆదిత్య ధార్ బయటికి వచ్చి విశేషాలు పంచుకుంటూ మెచ్చుకున్నవాళ్లకు థాంక్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 19 విడుదల కాబోయే దురంధర్ 2 రివెంజ్ కోసం ఫ్యాన్స్ అప్పుడే వెయిట్ చేయడం మొదలుపెట్టారు. నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి స్ట్రీమింగ్ జరిగాక దురంధర్ సీక్వెల్ డిమాండ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పట్లో అయితే ఈ స్పీడ్ ఆగేలా లేదు.
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో…
రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు…