Movie News

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా ఆ ఘనతే సాధించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ చిత్రంతోనే వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. నిజానికి ఈ సినిమాకు ముందు వేరే హీరోయిన్ని తీసుకున్నారు. కానీ తర్వాత ఆమె సూట్ కాదనిపించి.. కృతి శెట్టిని ఎంచుకున్నాడు బుచ్చిబాబు.

తాను ఈ సినిమా చేసే ముందు ఏదో ఊహించుకుని వచ్చానని.. కానీ షూటింగ్ చేస్తున్నపుడు పడ్డ కష్టం, ఎదురైన సమస్యలు చూశాక.. నటన తన వల్ల కాదు అనే నిర్ణయానికి వచ్చేసినట్లు కృతి తెలిపింది. ఆ ఒక్క సినిమాతో నటన ఆపేద్దాం అనుకున్న తాను.. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది కృతి.

మీ తొలి చిత్రానికి సంబంధించి ఏమైనా మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయా అని ఇంటర్వ్యూలో అడగ్గా, దానికి బదులిస్తూ.. ‘‘ఉప్పెన నా జీవితాన్ని మార్చిన అనుభవం. ఐతే ఒక నటిగా అంత కష్టం ఉంటుందని ఆ సినిమా చేసే ముందు అస్సలు అనుకోలేదు. సినిమాల గురించి నేను ఊహించుకున్నది వేరు. అక్కడ ఎదురైన అనుభవం వేరు. నటించడం చాలా కష్టం అనిపించింది. ఆ పాత్ర చాలా డిమాండ్ చేసింది. కానీ నేను దానికి నేను ప్రిపేరై రాలేదు. నా తల్లిదండ్రులకు కూడా సినిమా కొత్త కాబట్టి నన్నేమీ ప్రిపేర్ చేయలేకపోయారు.

షూటింగ్‌లో విపరీతమైన స్ట్రెస్ ఎదుర్కొన్నాను. దాని వల్ల నా వెంట్రుకలు రాలిపోయాయి. చర్మ సమస్యలు కూడా తలెత్తాయి. ఆ స్ట్రెస్‌ను నేను హ్యాండిల్ చేయలేకపోయాను. అంత సామర్థ్యం నాకు లేదు అనిపించింది. అది చూసి భయపడ్డ నా తల్లిదండ్రులు ఇంత కష్టం అయితే ఇక సినిమాలు వద్దు, ఈ ఒక్కటి చేసి వదిలేద్దాం అన్నారు.

నేను కూడా ఇది నాకు సూట్ కాదు, ఈ సినిమా తర్వాత నటన ఆపేద్దాం అనే అనుకున్నా. కానీ ఆ సినిమా రిలీజైనపుడు ప్రేక్షకుల నుంచరి వచ్చిన ప్రేమ చూశాక నా ఆలోచన మార్చుకున్నా. ప్రేక్షకుల కోసమే సినిమాలు చేయాలనుకున్నా. వాళ్లు ఇచ్చే ప్రేమను తిరిగివ్వడమే నా లక్ష్యం’’ అని కృతి చెప్పింది.

Kumar

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago