నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకే కాదు పక్క రాష్ట్రాల ప్రొడ్యూసర్లు సైతం ఫేస్ చేస్తున్నారు. కార్తీ హీరోగా రూపొందిన వా వతియార్(తెలుగులో అన్నగారు వస్తారు) డిసెంబర్ 12 విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చి ప్రమోషన్లు మొదలుపెట్టారు. కానీ ఈలోగా మదరాసు హై కోర్టు దాన్ని ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి తనకు రావాల్సిన 21 కోట్ల 78 లక్షలకు సంబంధించి కేసు వేయడంతో ఇప్పుడీ చిక్కుముడి వచ్చింది.
ఆ సొమ్మును చెల్లిస్తే అన్నగారు వస్తారుకి రూట్ క్లియర్ అవుతుంది. నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువ నుంచే పలు ఇబ్బందులు పడుతున్న వైనం గురించి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అది డిజాస్టర్ కావడం తీవ్ర ప్రభావం చూపించింది. రెండో భాగం ఆగిపోయింది. స్వయంగా సూర్య బంధువు కావడంతో ఇప్పటిదాకా ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకోలేదు. నిజానికి అన్నగారు వస్తారు చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఏదోలా అన్ని క్లియర్ చేసుకుని డిసెంబర్ కు రెడీ అయ్యారు. తీరా చూస్తే ఇప్పుడీ ట్విస్టు మళ్ళీ ఆగిపోయేలా చేసింది. ఇంకో వారం టైం ఉంది కాబట్టి పరిష్కారం చేస్తారేమో.
కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన అన్నగారు వస్తారుకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. కామెడీ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కార్తీ ఇందులో విక్రమార్కుడు తరహా పాత్ర చేశాడు. ప్రోమోలు చూస్తే అదే అనిపిస్తోంది. ఇప్పటికైతే కార్తీ దీని గురించి స్పందించలేదు. ఆర్థిక చిక్కు కాబట్టి హీరో నుంచి రెస్పాన్స్ ఆశించలేం కానీ తనవంతు బాధ్యతగా ఏమైనా చొరవ తీసుకుని సాల్వ్ చేస్తాడేమో చూడాలి. జననాయకుడు, పరాశక్తి ఉన్నందుకు సంక్రాంతికి వాయిదా వేసే ఛాన్స్ లేదు. డిసెంబర్ 18 ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కాబట్టి మళ్ళీ క్రిస్మస్ కు వెళ్లాల్సి ఉంటుంది. చూడాలి ఏం చేస్తారో.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…