టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. గత కొన్నేళ్లలో విడాకులు, అనారోగ్య సమస్యలతో సతమతం అయిన ఆమె ఈ మధ్య చాలా హుషారుగా కనిపించడం తన అభిమానులకు సంతోషాన్నిచ్చింది. ఇప్పుడామె మళ్ళీ పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం వారికి మరింత ఆనందాన్నిచ్చింది.
కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఈషా ఫౌండేషన్లో వీరి పెళ్లి జరిగింది. కొన్ని నెలలుగా అక్కడికి తరచుగా వెళ్తున్న.. సమంత, రాజ్ అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు.
ఈ పెళ్లి సాధారణంగా జరిగింది కాదని.. దీనికి విశిష్టత ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈషా యోగ కేంద్రంలోని లింగ భైరవి సన్నిధిలో.. సమంత, రాజ్ పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లిని యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారట.
ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతిక సంబంధానికి అతీతంగా.. దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియగా ఈ ‘భూత శుద్ధి వివాహం’ గురించి చెబుతున్నారు. లింగ భైరవి ఆలయాలు.. శుద్ధి చేసిన ప్రత్యేక ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ ప్రక్రియ వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుందట. ఇలా పెళ్లి చేసుకున్న దంపతుల జీవితాల్లో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దైవానుగ్రహం పొందుతారట. సమంత, రాజ్ ఇద్దరికి ఇది రెండో వివాహం. ఏ కలతలు లేకుండా ఈ బంధం సాగిపోయేలా ఇద్దరూ భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on December 1, 2025 9:25 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…