ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక ఒక వ్యక్తి అందుబాటులో లేకపోయినా.. కేవలం వాళ్ల ఫొటోలను వాడి వాళ్లు నటిస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు వీడియోలు, ఆడియోలు రెడీ చేసేస్తున్నారు. క్రమంగా వీటిలో పర్ఫెక్షన్ కూడా కనిపిస్తోంది. దీంతో ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అని కనిపెట్టడం కూడా కష్టమవుతోంది. వీటి వల్ల వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.
ఐతే ఫేక్ అనిపించకుండా, ఎవ్వరినీ నొప్పించకుండా అదే సమయంలో ఏఐ సాయంతో అందరినీ ఆకట్టుకునే హృద్యమైన వీడియోలు కూడా తయారవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలను చిన్న పిల్లల్లా చూపించి షార్ట్ స్టోరీస్ను అందంగా చెబుతూ రూపొందిస్తున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లతో రూపొందిస్తున్న వీడియోలు హైలైట్గా ఉంటున్నాయి.
మహేష్, తారక్లను బెస్ట్ ఫ్రెండ్స్లా చూపిస్తూ.. వాళ్లు పేద వాళ్లుగా ఉంటే ఎలా ఉంటుందో షార్ట్ స్టోరీస్ ద్వారా చూపిస్తున్నారు ఈ వీడియోల్లో. డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ.. అవమానాలు ఎదుర్కొంటూ.. కష్టపడి పైకి ఎదిగి తాము కోరుకున్నది సాధించుకునే కాన్సెప్ట్లతో ఈ వీడియోలు చేస్తున్నారు. రకరకాల సిచువేషన్లు తీసుకుని ఎంతో హృద్యంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. వీటి నిడివి నిమిషంలోపే ఉంటోంది.
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అజిత్, విజయ్.. ఇలా చాలామందిని ఇందులో భాగం చేస్తున్నారు. ఈ స్టార్ హీరోల లుక్స్.. వాళ్ల హావభావాలు చాలా క్యూట్గా ఉంటున్నాయి. హృద్యమైన సంగీతం కూడా తోడవుతుండడంతో ఈ వీడియోలు భలేగా అనిపిస్తున్నాయి. వీటికి వ్యూస్ కూడా కోట్లల్లో ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…