ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక ఒక వ్యక్తి అందుబాటులో లేకపోయినా.. కేవలం వాళ్ల ఫొటోలను వాడి వాళ్లు నటిస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు వీడియోలు, ఆడియోలు రెడీ చేసేస్తున్నారు. క్రమంగా వీటిలో పర్ఫెక్షన్ కూడా కనిపిస్తోంది. దీంతో ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అని కనిపెట్టడం కూడా కష్టమవుతోంది. వీటి వల్ల వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.
ఐతే ఫేక్ అనిపించకుండా, ఎవ్వరినీ నొప్పించకుండా అదే సమయంలో ఏఐ సాయంతో అందరినీ ఆకట్టుకునే హృద్యమైన వీడియోలు కూడా తయారవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలను చిన్న పిల్లల్లా చూపించి షార్ట్ స్టోరీస్ను అందంగా చెబుతూ రూపొందిస్తున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లతో రూపొందిస్తున్న వీడియోలు హైలైట్గా ఉంటున్నాయి.
మహేష్, తారక్లను బెస్ట్ ఫ్రెండ్స్లా చూపిస్తూ.. వాళ్లు పేద వాళ్లుగా ఉంటే ఎలా ఉంటుందో షార్ట్ స్టోరీస్ ద్వారా చూపిస్తున్నారు ఈ వీడియోల్లో. డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ.. అవమానాలు ఎదుర్కొంటూ.. కష్టపడి పైకి ఎదిగి తాము కోరుకున్నది సాధించుకునే కాన్సెప్ట్లతో ఈ వీడియోలు చేస్తున్నారు. రకరకాల సిచువేషన్లు తీసుకుని ఎంతో హృద్యంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. వీటి నిడివి నిమిషంలోపే ఉంటోంది.
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అజిత్, విజయ్.. ఇలా చాలామందిని ఇందులో భాగం చేస్తున్నారు. ఈ స్టార్ హీరోల లుక్స్.. వాళ్ల హావభావాలు చాలా క్యూట్గా ఉంటున్నాయి. హృద్యమైన సంగీతం కూడా తోడవుతుండడంతో ఈ వీడియోలు భలేగా అనిపిస్తున్నాయి. వీటికి వ్యూస్ కూడా కోట్లల్లో ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
This post was last modified on November 18, 2025 7:19 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…