స్టార్ హీరోయిన్లు చాలామంది పెళ్లి తర్వాత సినిమాలు మానేసిన వాళ్లే. కానీ అందరూ ఇదే బాట పడతారని అనుకోవడానికి లేదు. వివాహం తర్వాత కూడా కెరీర్ను బాగా నడిపిస్తున్న వాళ్లూ ఉన్నారు. కాజల్ అగర్వాల్ కూడా ఈ జాబితాలో చేరేలాగే ఉంది. ఆమె పెళ్లి జరిగే సమయానికి ‘ఆచార్య’, ‘ఇండియన్-2’ లాంటి భారీ చిత్రాలు తన చేతిలో ఉన్నాయి. పెళ్లి తర్వాత ఈ సినిమాలు చేసేసి కాజల్ ఊరుకుంటుందని అనుకున్న వాళ్లూ ఉన్నారు. కానీ తనకలాంటి ఉద్దేశాలేమీ లేవని చందమామ చెప్పకనే చెప్పింది. పెళ్లి తర్వాత ఆమె కొత్తగా ఓ సినిమా ఒప్పుకుంది. ఇది ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడం.. అలాగే కాజల్ ఇంతవరకు చేయని జానర్లో తెరకెక్కబోతుండటం విశేషం.
కాజల్ ఇంతకుముందు జీవా సరసన తమిళంలో ‘కవలై వేండాం’ అనే సినిమాలో నటించింది. తెలుగులో ఈ చిత్రం ‘ఎంత వరకు ఈ ప్రేమ’ పేరుతో అనువాదమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా దాని దర్శకుడు డీకే మీద కాజల్కు బాగా కుదిరినట్లుంది. అతడి దర్శకత్వంలో ఓ హార్రర్ థ్రిల్లర్ చేయడానికి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇందులో మరో ముగ్గురు కథానాయికలు కీలక పాత్రలు పోషిస్తారట. ఈ సినిమా కోసం ఇప్పటికే కాజల్ లుక్ టెస్ట్లోనూ పాల్గొందట. అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాకు సంతకం చేసిందట. ఆమె త్వరలోనే ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొనబోతోంది. ‘ఇండియన్-2’ ఎప్పుడు పున:ప్రారంభం అయ్యేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘హేయ్ సినామికా’లోనూ కాజల్ ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇందులో అదితిరావు హైదరి మరో కథానాయిక. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా కాజల్ ఇంత బిజీగా ఉండటం విశేషమే.
This post was last modified on December 2, 2020 3:34 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…