Movie News

కీర్తి సురేష్… ఎన్నాళ్లకెన్నాళ్లకు

కీర్తి సురేష్‌ను తెలుగు ప్రేక్షకులు పరభాషా కథానాయికలా చూడరు. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులపై అలాంటి ముద్ర వేసిందామె. కానీ తర్వాత ఆమె అంచనాలను అందుకోలేకపోయింది. ‘సర్కారు వారి పాట’ సహా పలు చిత్రాల్లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఐతే ఫలితాలు ఎలా ఉన్నా కీర్తిని వెండితెరపై చూడడం మన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. కానీ అనుకోకుండా ఆమెకు, తెలుగు ప్రేక్షకులకు కనెక్షన్ కట్ అయిపోయింది. తనను తెలుగు వెండితెరపై చూసి చాలా రోజులైపోయింది.

తెలుగులో ఆమె కథానాయికగా నటించి థియేటర్లలో రిలీజైన చివరి చిత్రం 2022లో వచ్చిన ‘సర్కారు వారి పాట’నే. తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’లో చెల్లెలి పాత్రలో కనిపించింది. ఈ ఏడాది ‘ఉప్పు కప్పురంబు’ సినిమాతో పలకరించినప్పటికీ.. అది ఓటీటీకి పరిమితమైంది. ఐతే మూడేళ్ల విరామం తర్వాత కీర్తి కథానాయికగా నటించిన ఓ తెలుగు చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. అదే.. రివాల్వర్ రీటా.

జేకే చంద్రు అనే తమిళ దర్శకుడు రూపొందించిన ‘రివాల్వర్ రీటా’ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో రాధిక శరత్ కుమార్, ఓ కీలక పాత్ర చేసింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇంతకుముందు కీర్తి అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది కానీ.. ఇందులో ఫుల్ యాక్షన్, హీరోయిజం ఉండబోతున్నాయి. ఎప్పుడో షూట్ పూర్తయినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం అయింది.

ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. కీర్తి దీని గురించి అధికారికంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. పెద్దగా పోటీ లేని సమయంలో రిలీజవుతున్న ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే కీర్తికి చాన్నాళ్ల తర్వాత ఓ విజయం దక్కొచ్చు. ఆమె తెలుగులో కొంచెం గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళం, మలయాళంలోనూ ఆమెకు కొన్ని సినిమాలున్నాయి.

This post was last modified on November 11, 2025 2:22 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

35 minutes ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

47 minutes ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

3 hours ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

7 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

12 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

13 hours ago