కీర్తి సురేష్ను తెలుగు ప్రేక్షకులు పరభాషా కథానాయికలా చూడరు. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులపై అలాంటి ముద్ర వేసిందామె. కానీ తర్వాత ఆమె అంచనాలను అందుకోలేకపోయింది. ‘సర్కారు వారి పాట’ సహా పలు చిత్రాల్లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఐతే ఫలితాలు ఎలా ఉన్నా కీర్తిని వెండితెరపై చూడడం మన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. కానీ అనుకోకుండా ఆమెకు, తెలుగు ప్రేక్షకులకు కనెక్షన్ కట్ అయిపోయింది. తనను తెలుగు వెండితెరపై చూసి చాలా రోజులైపోయింది.
తెలుగులో ఆమె కథానాయికగా నటించి థియేటర్లలో రిలీజైన చివరి చిత్రం 2022లో వచ్చిన ‘సర్కారు వారి పాట’నే. తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’లో చెల్లెలి పాత్రలో కనిపించింది. ఈ ఏడాది ‘ఉప్పు కప్పురంబు’ సినిమాతో పలకరించినప్పటికీ.. అది ఓటీటీకి పరిమితమైంది. ఐతే మూడేళ్ల విరామం తర్వాత కీర్తి కథానాయికగా నటించిన ఓ తెలుగు చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. అదే.. రివాల్వర్ రీటా.
జేకే చంద్రు అనే తమిళ దర్శకుడు రూపొందించిన ‘రివాల్వర్ రీటా’ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో రాధిక శరత్ కుమార్, ఓ కీలక పాత్ర చేసింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇంతకుముందు కీర్తి అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది కానీ.. ఇందులో ఫుల్ యాక్షన్, హీరోయిజం ఉండబోతున్నాయి. ఎప్పుడో షూట్ పూర్తయినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం అయింది.
ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. కీర్తి దీని గురించి అధికారికంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. పెద్దగా పోటీ లేని సమయంలో రిలీజవుతున్న ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే కీర్తికి చాన్నాళ్ల తర్వాత ఓ విజయం దక్కొచ్చు. ఆమె తెలుగులో కొంచెం గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళం, మలయాళంలోనూ ఆమెకు కొన్ని సినిమాలున్నాయి.
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…