విలన్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందన్నది సినిమాల్లో ప్రాథమిక సూత్రం. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శకులు ఆ పాత్రల్ని బలంగా తీర్చిదిద్దడానికి, ఆ పాత్రల కోసం స్టేచర్ ఉన్న ఆర్టిస్టులను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మాస్ రాజా రవితేజ హీరోగా తాను తెరకెక్కించబోయే కొత్త సినిమా ‘ఖిలాడి’ కోసం రమేష్ వర్మ ఓ సూపర్ విలన్ను ఓకే చేసినట్లు సమాచారం. ఆ విలన్ మరెవరో కాదు.. యాక్షన్ కింగ్ అర్జున్.
కెరీర్లో చాలా వరకు హీరోగా నటించిన అర్జున్.. క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలయ్యాక అప్పుడప్పుడూ విలన్ పాత్రల్లోనూ మెరుస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ సినిమా ‘అభిమన్యుడు’లో అతడి విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హీరో పాత్రను మించి అది హైలైట్ అయింది. అలాగే తెలుగులో ‘లై’ సినిమాలోనూ విలన్గా మెరిశాడు అర్జున్. ఆ చిత్రం సరిగా ఆడకపోయినా అర్జున్ పాత్ర, నటన మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమాలోనూ విలన్ పాత్ర ప్రత్యేకమైంది కావడంతో దానికి అర్జున్ను అడగడం, అతను ఓకే చెప్పడం జరిగాయట. రవితేజ సినిమాలో అర్జున్ విలన్ అంటే ఆ కాంబినేషన్పై ప్రత్యేక ఆసక్తి నెలకొని, సినిమాపై అంచనాలు పెరగడానికి అవకాశముంటుంది. ‘ఖిలాడి’ ఓ తమిళ చిత్రానికి రీమేక్ అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఆ చిత్రం ఇంకా విడుదలే కాకపోవడం విశేషం.
అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ‘శతురంగ వేట్టై-2’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఐతే మంచి సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ హైస్ట్ థ్రిల్లర్ను రవితేజ కోసం ఎంచుకున్నాడట రమేష్ వర్మ. గత ఏడాది రమేష్ వర్మ తీసిన మరో తమిళ రీమేక్ ‘రాక్షసుడు’ మంచి విజయాన్నందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన కోనేరు సత్యనారాయణనే ‘ఖిలాడి’ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
This post was last modified on December 2, 2020 3:32 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…