విలన్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందన్నది సినిమాల్లో ప్రాథమిక సూత్రం. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శకులు ఆ పాత్రల్ని బలంగా తీర్చిదిద్దడానికి, ఆ పాత్రల కోసం స్టేచర్ ఉన్న ఆర్టిస్టులను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మాస్ రాజా రవితేజ హీరోగా తాను తెరకెక్కించబోయే కొత్త సినిమా ‘ఖిలాడి’ కోసం రమేష్ వర్మ ఓ సూపర్ విలన్ను ఓకే చేసినట్లు సమాచారం. ఆ విలన్ మరెవరో కాదు.. యాక్షన్ కింగ్ అర్జున్.
కెరీర్లో చాలా వరకు హీరోగా నటించిన అర్జున్.. క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలయ్యాక అప్పుడప్పుడూ విలన్ పాత్రల్లోనూ మెరుస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ సినిమా ‘అభిమన్యుడు’లో అతడి విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హీరో పాత్రను మించి అది హైలైట్ అయింది. అలాగే తెలుగులో ‘లై’ సినిమాలోనూ విలన్గా మెరిశాడు అర్జున్. ఆ చిత్రం సరిగా ఆడకపోయినా అర్జున్ పాత్ర, నటన మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమాలోనూ విలన్ పాత్ర ప్రత్యేకమైంది కావడంతో దానికి అర్జున్ను అడగడం, అతను ఓకే చెప్పడం జరిగాయట. రవితేజ సినిమాలో అర్జున్ విలన్ అంటే ఆ కాంబినేషన్పై ప్రత్యేక ఆసక్తి నెలకొని, సినిమాపై అంచనాలు పెరగడానికి అవకాశముంటుంది. ‘ఖిలాడి’ ఓ తమిళ చిత్రానికి రీమేక్ అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఆ చిత్రం ఇంకా విడుదలే కాకపోవడం విశేషం.
అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ‘శతురంగ వేట్టై-2’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఐతే మంచి సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ హైస్ట్ థ్రిల్లర్ను రవితేజ కోసం ఎంచుకున్నాడట రమేష్ వర్మ. గత ఏడాది రమేష్ వర్మ తీసిన మరో తమిళ రీమేక్ ‘రాక్షసుడు’ మంచి విజయాన్నందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన కోనేరు సత్యనారాయణనే ‘ఖిలాడి’ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
This post was last modified on December 2, 2020 3:32 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…