ప్రపంచమంతటా కరోనా విజృంభణ కొనసాగుతూ వుంటే… ఏదో కరోనా ఫ్రీ ప్రాంతమన్నట్టు మాల్దీవులకు భారతీయ సినీ, టెలివిజన్ తారలందరూ విహారానికి వెళుతుండడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలా వెళ్లిన వారిలో మన సమంత, రకుల్ ప్రీత్ సింగ్ కూడా వున్నారు. అయితే మరెక్కడికీ వెళ్లకుండా అందరూ మాల్దీవులకే ఎందుకు వెళ్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక బాలీవుడ్ నటుడు సదరు గుట్టు రట్టు చేసేసాడు.
మాల్దీవులకు హాలిడేకు రావాలంటూ తనకూ ఆహ్వానం వచ్చిందని, ఫ్లయిట్ ఖర్చులతో పాటు అక్కడున్నన్ని రోజులకు అవసరమయ్యే వసతులన్నీ తామే భరిస్తామంటూ పలు రిసార్టుల నుంచి పిలుపు వచ్చిందట. కాకపోతే అక్కడున్న టైమ్లో తమ రిసార్ట్ని హైలైట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఇవ్వాలని అడిగారట. అతను వెళ్లలేదు కానీ అక్కడకు వెళ్లిన మిగతా వారి గురించిన గుట్టు చెప్పేసాడు.
కరోనా వల్ల టూరిజం మీద ఆధార పడ్డ ప్రాంతాలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లోని రిసార్ట్ ఓనర్లు ఈ విధంగా భారతీయ తారలను ఆకర్షించి తద్వారా మిగతా జనాలను రాబట్టాలని చూస్తున్నారు. ఎంతమంది వెళుతున్నారనేది పక్కన పెడితే మాల్దీవులకు వెళ్లి తీరాలనే జనం మాత్రం సోషల్ మీడియాలో బాగానే పెరిగారు. ఒక్కసారి కరోనా ఫ్రీ అనే న్యూస్ వస్తే ఇప్పుడు పెట్టిన ఖర్చులకు ఎన్నో ఇంతల లాభాలు చూడొచ్చు.
This post was last modified on November 30, 2020 8:48 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…