మొత్తానికి ‘కాంతార: చాప్టర్-1’ సాధించింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్గా ఈ కన్నడ సినిమా నిలుస్తుందా లేదా అనే సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు ‘కాంతార: చాప్టర్-1’ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన బాలీవుడ్ మూవీ ‘ఛావా’ రూ.807 కోట్లతో రికార్డు నెలకొల్పగా.. తర్వాత ఏ చిత్రమూ దాన్ని దాటలేకపోయింది. ‘సైయారా’ రూ.600 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. ‘కూలీ’ రికార్డు సాధిస్తుందనుకుంటే దానికీ అది సాధ్యం కాలేదు.
ఐతే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కాంతార: చాప్టర్-1’.. ఆ అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టి రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన 22వ రోజుకు కాంతార వసూళ్లు రూ.818 కోట్లకు చేరుకున్నాయి. ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్. ఐతే ఇంతకు మించి ‘కాంతార: చాప్టర్-1’ వసూళ్లు పెద్దగా పెరిగే అవకాం కనిపించడం లేదు. ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోవచ్చనే అంచనాలు కలిగాయి కానీ.. అది సాధ్యం కాలేదు. ఈ చిత్రం మరి కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘కాంతార: చాప్టర్-1’ ఓవరాల్గా 2025 ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది కానీ.. ఓవర్సీస్లో మాత్రం ఇది లాస్ వెంచరే అయింది. ఈ సినిమా నార్త అమెరికాలో 7 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యేది. కానీ ఈ సినిమా అక్కడ 5 మిలియన్ల దగ్గర ఆగిపోయింది. ప్రిమియర్స్కు ఆశించిన స్పందన లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. తొలి వీకెండ్లో కూడా ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయి. సినిమాకు లాంగ్ రన్ ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్ తగ్గడం మైనస్ అయి సినిమా అక్కడ లాస్ వెంచర్గా మిగిలింది.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…