ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో కూడా వేరే స్టార్లు క్యామియోలు, ప్రత్యేక పాత్రలు చేయడం మామూలైపోయింది. వీలైనపుడు మల్టీస్టారర్లు కూడా చేస్తున్నారు స్టార్లు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక పలు చిత్రాల్లో వేరే స్టార్లు ప్రత్యేక పాత్రలు పోషించారు. సైరాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి నటిస్తే.. వాల్తేరు వీరయ్యలో రవితేజ సందడి చేశాడు. ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ చిత్రంలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక చిరు నటించబోయే తర్వాతి సినిమాలోనూ ఒక స్టార్ హీరోతో ప్రత్యేక పాత్ర చేయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ తెలుగు వాడు కాదు.. తెలుగువారికి బాగా చేరువైన తమిళ నటుడు కార్తి. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో కార్తి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాల్తేరు వీరయ్యలో రవితేజ తరహాలోనే ఇది కూడా కథలో కీలకమైన, సినిమాలో హైలైట్గా నిలిచే పాత్రేనట.
ప్రస్తుతం సౌత్ ఇండియాలో హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటిగా మారుతున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్లో ఈ సినిమాను రూపొందించనుంది. ఫుల్ యాక్షన్ టచ్ ఉన్న కథతో ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనుండగా.. మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం సమకూర్చనున్నాడు.
కార్తికి తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది. అన్న సూర్యతో సమానంగా ఇక్కడ గుర్తింపు సంపాదించాడు. అతను ఇప్పటికే తెలుగులో ఊపిరి మూవీ చేశాడు. త్వరలో హిట్-4లోనూ నటించాల్సి ఉంది. ఈలోపే చిరు సినిమాలో ప్రత్యేక పాత్రకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కాంబో ఎవ్వరూ ఊహించనిది. ఈ వార్త నిజమే అయితే ఈ సినిమాకు తమిళంలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…