Movie News

దేవి వచ్చాడు.. మరి కీర్తికి ఓకేనా?

టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉండి, ఎంతకూ సెట్స్ మీదకు వెళ్లని సినిమా.. యల్లమ్మ. ‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ వేణు యల్దండి.. తన రెండో చిత్రంగా దీన్ని రూపొందించాలనకున్నాడు. నిర్మాత దిల్ రాజు మరోసారి వేణు మీద నమ్మకం పెట్టాడు. కానీ ముందు నానితో అనుకున్న సినిమా.. తర్వాత నితిన్ దగ్గరికి వచ్చింది. ఏవో కారణాలతో అతను కూడా తప్పుకుంటే.. చివరికి ఎవ్వరూ ఊహించని విధంగా దేవిశ్రీ ప్రసాద్ లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

చాలా ఏళ్ల కిందట దేవిని తనే దర్శకుడిగా పరిచయం చేస్తా అన్న దిల్ రాజు ఇలా మాట నిలబెట్టుకుంటున్నాడు. కానీ సుకుమార్‌ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ చేస్తా అన్నాడు కానీ.. వేణుకు ఆ ఛాన్స్ దక్కింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఐతే ఈ చిత్రంలో దేవికి జోడీగా ఎవరు కథానాయికగా నటిస్తారన్నది ఆసక్తికరం. నితిన్‌తో సినిమా అనుకున్నపుడు కీర్తి సురేష్‌ దాదాపుగా ఓకే అయిపోయింది.

‘రంగ్ దే’ తర్వాత మరోసారి నితిన్‌తో జట్టు కట్టడానికి కీర్తి ఓకే చెప్పింది. ఐతే ‘యల్లమ్మ’ సంగతి తేలకముందే దిల్ రాజు ప్రొడక్షన్లో కీర్తి.. విజయ్ దేవరకొండ సినిమాకు కథానాయికగా ఎంపికైంది. ఇప్పుడు ‘యల్లమ్మ’లో దేవి హీరోగా నటించబోతున్నాడు. రాజు సంస్థలో ఆమె వరుసగా రెండో సినిమా చేస్తుందా.. దేవితో జట్టు కట్టడానికి ఆమెకు ఓకేనా అన్నది చూడాలి.

ఐతే కీర్తి స్టార్ల సరసనే నటించాలి అనే రూల్స్ ఏమీ పెట్టుకోదు. చిన్న హీరోలతోనూ కలిసి పని చేస్తుంది. హీరోయిన్ కాదు కానీ.. సుహాస్‌తో కూడా కలిసి ‘ఉప్పు కప్పురంబు’ సినిమా చేసింది. కాబట్టి దేవితో సినిమా చేయడానికి కీర్తికి ఇబ్బంది లేకపోవచ్చు. కాకపోతే తనకు పాత్ర నచ్చాలి. మరి వేణు ఆమెను ఇంప్రెస్ చేసి ఈ సినిమాలో నటింపజేస్తే.. సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on October 18, 2025 6:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

6 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

7 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

9 hours ago