ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు దీపావళి పండగని టార్గెట్ చేసుకోవడంతో థియేటర్లు జనంతో కళకళలాడిపోతాయని బయ్యర్లు ఆశించారు. అయితే టాక్స్ ఎలా ఉన్నాయనేది పక్కనపెడితే అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మిత్ర మండలి ప్రీమియర్లకు ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపించింది కానీ సోషల్ మీడియా ట్రెండ్స్ గమనిస్తే వాటిలో అధిక శాతం గివ్ అవే రూపంలో ట్విట్టర్ ద్వారా పంచిన టికెట్లేనని అర్థమైపోతోంది. తెలుసు కదాలో ప్రామిసింగ్ క్యాస్టింగ్ ఉన్నా ఆశించిన స్థాయిలో దూకుడు లేదు. జానర్ పరిమితుల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా దాని వైపు చూడలేదు.
ఉన్నంతలో డ్యూడ్ కొంచెం డీసెంట్ ఆక్యుపెన్సీలు చూపించింది కానీ మైత్రి ప్రదర్శించిన నమ్మకంతో పోల్చుకుంటే అదీ తక్కువేనని చెప్పాలి. ఎబోవ్ యావరేజ్ నుంచి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఇక ప్రమోషన్ల పరంగా చాలా హడావిడి చేసిన కె ర్యాంప్ సైతం బుకింగ్స్ విషయంలో పోరాడుతోంది. దీనికీ టాక్ చాలా కీలకం. ఇక అసలు పండక్కు ఇంత స్లో ఓపెనింగ్స్ ఎందుకున్నాయనే పాయింట్ కు వద్దాం. వరసగా రెండు వారాలు ఓజి, కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ని పది రోజుల పాటు ఎక్కువ ధరలకు చూసిన ప్రేక్షకులు వెంటనే కొత్త సినిమాలకు చూసేందుకు సరిపడా ఊపు, బజ్ మేకర్స్ సృష్టించలేకపోయారనేది వాస్తవం.
ఇంతకన్నా ఏం చేయాలని నిర్మాతలు అనుకోవచ్చు. నిజమే. ఎంత చేయాలో అంతా చేశారు. అసలు సమస్య జనాల మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్, రిషబ్ శెట్టి ఇచ్చిన హై ఏదైతే ఉందో ఆ హ్యాంగోవర్ నుంచి బయట పడే స్థాయిలో కొత్త కంటెంట్లు వచ్చాయనే నమ్మకాన్ని పూర్తి స్థాయికి క్రియేట్ చేయలేకపోయారు. ఒకవేళ యునానిమస్ గా సూపర్ హిట్ అనిపించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. పండగ ఎలాగూ సోమ మంగళవారాలు కాబట్టి వీకెండ్ కంతా పికప్ అయిపోవచ్చు. కాకపోతే గత ఏడాది లాగా దీపావళికి మూడు బ్లాక్ బస్టర్లు పడటం జరిగేలా లేదు. ఉన్నంతలో ఎవరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో చూడాలి.
This post was last modified on October 18, 2025 9:08 am
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…