ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు దీపావళి పండగని టార్గెట్ చేసుకోవడంతో థియేటర్లు జనంతో కళకళలాడిపోతాయని బయ్యర్లు ఆశించారు. అయితే టాక్స్ ఎలా ఉన్నాయనేది పక్కనపెడితే అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మిత్ర మండలి ప్రీమియర్లకు ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపించింది కానీ సోషల్ మీడియా ట్రెండ్స్ గమనిస్తే వాటిలో అధిక శాతం గివ్ అవే రూపంలో ట్విట్టర్ ద్వారా పంచిన టికెట్లేనని అర్థమైపోతోంది. తెలుసు కదాలో ప్రామిసింగ్ క్యాస్టింగ్ ఉన్నా ఆశించిన స్థాయిలో దూకుడు లేదు. జానర్ పరిమితుల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా దాని వైపు చూడలేదు.
ఉన్నంతలో డ్యూడ్ కొంచెం డీసెంట్ ఆక్యుపెన్సీలు చూపించింది కానీ మైత్రి ప్రదర్శించిన నమ్మకంతో పోల్చుకుంటే అదీ తక్కువేనని చెప్పాలి. ఎబోవ్ యావరేజ్ నుంచి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఇక ప్రమోషన్ల పరంగా చాలా హడావిడి చేసిన కె ర్యాంప్ సైతం బుకింగ్స్ విషయంలో పోరాడుతోంది. దీనికీ టాక్ చాలా కీలకం. ఇక అసలు పండక్కు ఇంత స్లో ఓపెనింగ్స్ ఎందుకున్నాయనే పాయింట్ కు వద్దాం. వరసగా రెండు వారాలు ఓజి, కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ని పది రోజుల పాటు ఎక్కువ ధరలకు చూసిన ప్రేక్షకులు వెంటనే కొత్త సినిమాలకు చూసేందుకు సరిపడా ఊపు, బజ్ మేకర్స్ సృష్టించలేకపోయారనేది వాస్తవం.
ఇంతకన్నా ఏం చేయాలని నిర్మాతలు అనుకోవచ్చు. నిజమే. ఎంత చేయాలో అంతా చేశారు. అసలు సమస్య జనాల మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్, రిషబ్ శెట్టి ఇచ్చిన హై ఏదైతే ఉందో ఆ హ్యాంగోవర్ నుంచి బయట పడే స్థాయిలో కొత్త కంటెంట్లు వచ్చాయనే నమ్మకాన్ని పూర్తి స్థాయికి క్రియేట్ చేయలేకపోయారు. ఒకవేళ యునానిమస్ గా సూపర్ హిట్ అనిపించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. పండగ ఎలాగూ సోమ మంగళవారాలు కాబట్టి వీకెండ్ కంతా పికప్ అయిపోవచ్చు. కాకపోతే గత ఏడాది లాగా దీపావళికి మూడు బ్లాక్ బస్టర్లు పడటం జరిగేలా లేదు. ఉన్నంతలో ఎవరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో చూడాలి.
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…
సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల…
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరా జయం పాలైన…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలోను.. ఇప్పుడు కూడా కేటీఆర్…