అందరు స్టార్ హీరోల రీ రిలీజులు ఇప్పటిదాకా బోలెడు జరిగాయి కానీ ఒక్క వెంకటేష్ మాత్రమే ఇందులో వెనుకబడి ఉన్నారు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా నిర్మాత సురేష్ బాబు తాను నిర్మాతైన బొబ్బిలి రాజా, కలిసుందాం రా, జయం మనదేరా లాంటివి మళ్ళీ విడుదల చేసేందుకు చొరవ చూపలేదు. బిజినెస్ కోణంలో అలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం సబబే కానీ ఫ్యాన్స్ ఎమోషన్స్ ని కూడా పట్టించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎట్టకేలకు వాళ్ళు కోరుకున్న క్షణం రానే వస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1 నూతన సంవత్సర కానుకగా నువ్వు నాకు నచ్చావ్ థియేటర్లకు రానుంది.
నిజంగానే ఇది చాలా స్పెషల్ మెమరీ కానుంది. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావ్ కు చాలా పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉంది. కేవలం ఫ్యాన్స్ కి నచ్చిన ఎంటర్ టైనర్ కాదిది. ఇప్పటికీ టీవీ, యూట్యూబ్ లో చూసే ఫ్యామిలీ ఆడియన్స్ లక్షలు కాదు కోట్లలో ఉంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్నులో కామెడీ ప్లస్ ఎమోషన్ బలం తెలిసింది దీని ద్వారానే. దర్శకుడు విజయ్ భాస్కర్ అయినప్పటికీ మాటల మాంత్రికుడికి ఎక్కువ గుర్తింపు రావడం అతిశయోక్తి కాదు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో స్రవంతి రవికిశోర్ నువ్వు నాకు నచ్చావ్ నిర్మించారు. కమర్షియల్ హవాలోనూ ఈ మూవీ వంద రోజులు ఆడటం విశేషం.
హీరోగా వెంకటేష్ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి కలయికలో సినిమా ప్రారంభం కాబోతున్న టైంలో నువ్వు నాకు నచ్చావ్ విడుదల చేయడం ఒకరకంగా టైం మెషీన్ ప్రయాణం లాంటిది. పైగా పాతికేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భం కన్నా మరొకటి రాదు. అదిరిపోయే వెంకటేష్ టైమింగ్, ఆర్తి అగర్వాల్ అందం, కోటి ఎవర్ గ్రీన్ సాంగ్స్, కామెడీ ఆర్టిస్టుల నిండైన నటన, హృద్యమైన ఎమోషన్లు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే విశేషాలతోనే ఒక పుస్తకం నిండిపోతుంది. బుల్లితెరపై మాత్రమే చూసిన ఇప్పటి జనరేషన్ ఖచ్చితంగా ఎక్స్ పీరియన్స్ అవ్వాల్సిన బిగ్ స్క్రీన్ మూవీ నువ్వు నాకు నచ్చావ్.
This post was last modified on October 9, 2025 4:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…