చెప్పాపెట్టకుండా నాగార్జున వందో సినిమా మొదలైపోయింది. మాములుగా ఇంత పెద్ద సీనియర్ హీరో తన జీవితంలో మైలురాయి లాంటి మూవీని ఆర్భాటంగా మొదలుపెడతారు. పైగా రెండో తరం స్టార్లలో తను మూడోవాడిగా ఈ ఘనత అందుకున్నారు. 1988 చిరంజీవి త్రినేత్రుడుతో, 2017 బాలకృష్ణ గౌతమీపుత్రశాతకర్ణితో ఈ లాంఛనం పూర్తి చేశారు. వెంకటేష్ ఇంకో పాతిక సినిమాల దూరంలో ఉన్నారు కాబట్టి కౌంట్ లోకి తీసుకోలేం. ఇప్పుడున్న హీరోల్లో ఇంకెవరూ సెంచరీ చేయడం అసాధ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి జ్ఞాపకాన్ని నాగార్జున ఎందుకింత సింపుల్ గా కానిచ్చారనే డౌట్ రావడం సహజం.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇప్పుడు సౌండ్ చేయడం కన్నా షూటింగ్ ఒక కొలిక్కి వచ్చాక టైటిల్ లాంచ్ లేదా టీజర్ రిలీజ్ ద్వారా ఈ వందో సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఇలా కానిచ్చేశారని తెలిసింది. ఈ మధ్య అక్కినేని అభిమానులు నాగార్జున కథల ఎంపిక పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కమర్షియల్ గా ఏ స్థాయికి వెళ్లాయనేది పక్కనపెడితే కూలి, కుబేర రెండింటిలోనూ చనిపోయే పాత్రలు చేయడం వాళ్ళకేమాత్రం నచ్చలేదు. అందులోనూ పాత డెన్ బాస్ టైపులో రజనీకాంత్ చేతిలో ప్రాణాలు కోల్పోవడం సగటు మూవీ లవర్స్ సైతం యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇదంతా నాగార్జున నోటీస్ కు వెళ్ళింది.
సో ముందు ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం తనముందున్న లక్ష్యం. నాగచైతన్య కెరీర్ పరంగా కుదురుకున్నప్పటికీ అఖిల్ ఇంకా బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కొడుకుల సంగతి ఎలా ఉన్నా ఫ్యాన్స్ వరకు నాగ్ ఒక బలమైన ఎమోషన్. సోగ్గాడే చిన్న నాయనా, బంగార్రాజు తరహా హిట్స్ కొట్టే ఎంటర్ టైనర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ కి తన వందో సినిమా ఇచ్చారంటే అందులో కంటెంట్ బలంగానే ఉంటుందని నమ్ముతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లతో పాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.
This post was last modified on October 7, 2025 2:56 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…