టాలీవుడ్ సీనియర్, లెజెండరీ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున వందో సినిమా ముంగిట ఉన్నాడు. ఆ సినిమా కోసం అభిమానులు చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్ల ముందు నుంచి ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా మొదలు కావట్లేదు. మోహన్ రాజా సహా వేర్వేరు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. పక్కకు వెళ్లిపోయాయి. చివరికి తమిళ దర్శకుడే అయిన రా.కార్తీక్తో నాగ్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
చివరికి స్వయంగా నాగార్జునే ఈ యువ దర్శకుడితో తన వందో సినిమా ఉంటుందని ఇటీవలే కన్ఫమ్ చేయడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. నాగ్ పుట్టిన రోజు అయిన ఆగస్టు 29న అ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని ఆశించారు కానీ.. అది జరగలేదు. ఐతే స్క్రిప్టు పక్కాగా రెడీ అయి, షూటింగ్కు ఏర్పాట్లు జరిగాకే సినిమాను అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో నాగ్ అండ్ టీం ఆగినట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు సమాచారం.
నాగ్ వందో సినిమాకు క్రేజీ టైటిల్ పెట్టబోతున్నట్లు ఓ సమాచారం బయటికి వచ్చింది. లాటరీ కింగ్ అనే టైటిల్తో ఈ సినిమా రాబోతోందట. నాగ్ ఇప్పటికే కింగ్ సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాతి నుంచి నాగ్ను అభిమానులు యువ సామ్రాట్ అని కాక కింగ్ అని పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగ్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీకి అది కలిసొచ్చేలా లాటరీ కింగ్ అనే టైటిల్ ఖాయం చేసినట్లు చెబుతున్నారు. వందో సినిమాలో అన్ని కమర్షియల్ హంగులూ ఉండాలన్న అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే ఈ చిత్రం ఉంటుందని నాగ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
ముందు నాగ్ వందో సినిమా రీమేక్ అని వార్తలు వచ్చినా.. నాగ్ ఆ ప్రచారాన్ని ఖండించాడు. ఇది గ్రాండియర్ ఉన్న సినిమా అని, భారీ యాక్షన్ ఉంటుందని.. దాంతో పాటే ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్లూ ఉంటాయని స్పష్టం చేశాడు. చివరగా హీరోగా 2024 సంక్రాంతికి నా సామిరంగ చిత్రంతో పలకరించిన నాగ్.. ఈ ఏడాది కుబేర, కూలీ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఆయన వందో సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This post was last modified on October 7, 2025 9:44 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…