టాలీవుడ్ సీనియర్, లెజెండరీ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున వందో సినిమా ముంగిట ఉన్నాడు. ఆ సినిమా కోసం అభిమానులు చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్ల ముందు నుంచి ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా మొదలు కావట్లేదు. మోహన్ రాజా సహా వేర్వేరు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. పక్కకు వెళ్లిపోయాయి. చివరికి తమిళ దర్శకుడే అయిన రా.కార్తీక్తో నాగ్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
చివరికి స్వయంగా నాగార్జునే ఈ యువ దర్శకుడితో తన వందో సినిమా ఉంటుందని ఇటీవలే కన్ఫమ్ చేయడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. నాగ్ పుట్టిన రోజు అయిన ఆగస్టు 29న అ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని ఆశించారు కానీ.. అది జరగలేదు. ఐతే స్క్రిప్టు పక్కాగా రెడీ అయి, షూటింగ్కు ఏర్పాట్లు జరిగాకే సినిమాను అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో నాగ్ అండ్ టీం ఆగినట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు సమాచారం.
నాగ్ వందో సినిమాకు క్రేజీ టైటిల్ పెట్టబోతున్నట్లు ఓ సమాచారం బయటికి వచ్చింది. లాటరీ కింగ్ అనే టైటిల్తో ఈ సినిమా రాబోతోందట. నాగ్ ఇప్పటికే కింగ్ సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాతి నుంచి నాగ్ను అభిమానులు యువ సామ్రాట్ అని కాక కింగ్ అని పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగ్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీకి అది కలిసొచ్చేలా లాటరీ కింగ్ అనే టైటిల్ ఖాయం చేసినట్లు చెబుతున్నారు. వందో సినిమాలో అన్ని కమర్షియల్ హంగులూ ఉండాలన్న అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే ఈ చిత్రం ఉంటుందని నాగ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
ముందు నాగ్ వందో సినిమా రీమేక్ అని వార్తలు వచ్చినా.. నాగ్ ఆ ప్రచారాన్ని ఖండించాడు. ఇది గ్రాండియర్ ఉన్న సినిమా అని, భారీ యాక్షన్ ఉంటుందని.. దాంతో పాటే ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్లూ ఉంటాయని స్పష్టం చేశాడు. చివరగా హీరోగా 2024 సంక్రాంతికి నా సామిరంగ చిత్రంతో పలకరించిన నాగ్.. ఈ ఏడాది కుబేర, కూలీ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఆయన వందో సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This post was last modified on October 7, 2025 9:44 am
శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే…
హనుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ సజ్జా. ఐతే ఈ…
ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి…
భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు…
కొన్ని రోజుల కిందట కోనసీమ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన…