ఈ మధ్యాకాలంలో సాలిడ్ గా చెప్పుకోదగిన బ్లాక్ బస్టర్లలో మొదటి స్థానం మిరాయ్ దే. ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ లోనూ అద్భుతమైన క్వాలిటీ ఇవ్వడమే కాక టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నా దాన్ని వాడుకోకుండా సాధారణ ధరలకే పరిమితం కావడం గొప్ప మేలు చేసింది. ఇంత టఫ్ కాంపిటీషన్ లోనూ నూటా యాభై కోట్ల వసూళ్లు దాటడం మాములు విషయం కాదు. ఓజి, కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నా సరే ఇప్పటికీ మిరాయ్ కి నాలుగో వారంలో మంచి ఆక్యుపెన్సీలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన కేంద్రాల్లో రోజుకు కనీసం మూడు నాలుగు షోలు పడుతూనే ఉన్నాయి.
ఇంత మంచి రన్ కొనసాగుతుండగానే మిరాయ్ ఓటిటిలో వచ్చేస్తోంది. జియో హాట్ స్టార్ లో నాలుగు భాషల్లో అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే థియేటర్ విండో కేవలం 28 రోజులు మాత్రమే. గతంలో హనుమాన్ ఇంతకన్నా గొప్ప విజయం సాధించినప్పుడు నిర్మాతల అభ్యర్థన మేరకు 55 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేశారు. అది కూడా హాట్ స్టార్ లోనే. కానీ మిరాయ్ మాత్రం అందులో సగం విండోకే బుల్లితెరపై రావడం అనూహ్యం. ఓజి, కాంతార తాకిడి ముందే గురించడం వల్లే అగ్రిమెంట్ నాలుగు వారాలకు చేసుకున్నారని అంతర్గత సమాచారం.
విచిత్రం ఏమిటంటే ఆగస్ట్ లో రిలీజైన వార్ 2 ఇప్పటిదాకా డిజిటల్ లో రాలేదు. అక్టోబర్ 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో రానుంది. హిందీలో మల్టీప్లెక్సుల నిబంధన మేరకు ఎనిమిది వారాల గడువు ఖచ్చితంగా పాటించాల్సిందే. అందుకే ఇంత ఆలస్యమవుతోంది. కానీ దక్షిణాదిలో అలాంటి కండీషన్లు లేకపోవడంతో నిర్మాతలు నెల రోజులకే పరిమితమవుతున్నారు. తేజ సజ్జ హీరోగా రూపొందిన మిరాయ్ ఇంత తక్కువ గ్యాప్ లో స్మార్ట్ స్క్రీన్ లో వచ్చేస్తోంది కాబట్టి వ్యూయర్ షిప్ భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడ కూడా రికార్డులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. హిందీ వెర్షన్ మాత్రం కొంచెం లేట్ చేస్తారు.
సీనియర్ స్టార్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అయ్యేలా ఉన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో…
తన కెరీర్లో ఇంకే చిత్రానికీ పడనంత కష్టాన్ని ‘పెద్ది’ సినిమా కోసం పడ్డాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.…
జాతీయ రాజకీయాలకు సంబంధించి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతోంది. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు…
వైసీపీ హయాంలో చెలరేగిపోయిన భూ మాఫియా కోరలు పీకామని.. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి…
దృశ్యం 3 థియేటర్లలో 200 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకుల బుర్రలో…
‘గుంటూరు కారం’ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయాలనుకున్న చిత్రం.. గాడ్ ఆఫ్ వార్. తన కెరీర్లో తొలిసారిగా…