మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లు దసరా నుంచి మొదలుపెట్టేస్తున్నారు. పబ్లిసిటీలో తనదైన మార్కు చూపించే రావిపూడి ఈసారి మూడు నెలలకు సరిపడా ప్లాన్ ని సిద్ధం చేసి ఉంచుకున్నాడట. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఎలాంటి మార్కెటింగ్ తో ఆడియన్స్ ని ఎక్కువ ఆకట్టుకోగలం అనే దాని మీద పెద్ద ప్రణాళికే వేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. షూటింగ్ జరుగుతున్న టైంలోనే అవసరమైన ప్రోమోలు ప్రత్యేకంగా షూట్ చేసుకుని వాటిని ఎప్పుడు ఎలా వాడాలో తన టీమ్ తో డిస్కస్ చేస్తున్నారట.
ఈసారి అనిల్ రావిపూడికి పోటీపరంగా భారీ ఛాలెంజులు ఉన్నాయి. ప్రభాస్ ది రాజా సాబ్ పెద్ద ఎత్తున బరిలో దిగుతున్నాడు. అది కూడా అందరి కంటే ముందు. జనవరి 9 విడుదల కాబోతున్న ఈ హారర్ డ్రామా మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ 77 కూడా ఎంటర్ టైన్మెంట్ జానర్ లో రూపొందినవే. విజయ్ జన నాయకుడు డబ్బింగ్ అయినా మరీ తక్కువంచనా వేయడానికి లేదు. సో ఇంత కాంపిటీషన్ లో జనాన్ని తనవైపు లాగాలంటే మెగాస్టార్ బ్రాండ్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో క్వాలిటీ కామెడీ ఉందనే నమ్మకం కలిగించాలి.
అందుకే ముందు జాగ్రత్తగా ఇంత అడ్వాన్స్ గా హడావిడి మొదలుపెడుతున్నారు. రాజా సాబ్ ఇప్పటిదాకా ఆరు నిమిషాల వీడియో కంటెంట్ వదిలింది. సంక్రాంతి సినిమాల్లో ఇంత స్పీడ్ గా వేరేవరిది లేదు. అందుకే అనిల్ రావిపూడికి స్పెషల్ ప్లాన్ అవసరమవుతుంది. భీమ్స్ పాటలు, నయనతార గ్లామర్, వెంకటేష్ ప్రత్యేక పాత్ర, బుల్లిరాజు క్యారెక్టర్ ఇలాంటి ఆకర్షణలు అన్నింటిని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ హైప్ ఎలా పెంచాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. రేపు రాబోయే ప్రోమో అనౌన్స్ మెంట్ తోనే మొదటి ఇంప్రెషన్ బలంగా పడుతుందని అంటున్నారు. చూడాలి మరి అనిల్ మార్కు ఎలా ఉండబోతోందో.
This post was last modified on October 1, 2025 11:16 am
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…