మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లు దసరా నుంచి మొదలుపెట్టేస్తున్నారు. పబ్లిసిటీలో తనదైన మార్కు చూపించే రావిపూడి ఈసారి మూడు నెలలకు సరిపడా ప్లాన్ ని సిద్ధం చేసి ఉంచుకున్నాడట. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఎలాంటి మార్కెటింగ్ తో ఆడియన్స్ ని ఎక్కువ ఆకట్టుకోగలం అనే దాని మీద పెద్ద ప్రణాళికే వేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. షూటింగ్ జరుగుతున్న టైంలోనే అవసరమైన ప్రోమోలు ప్రత్యేకంగా షూట్ చేసుకుని వాటిని ఎప్పుడు ఎలా వాడాలో తన టీమ్ తో డిస్కస్ చేస్తున్నారట.
ఈసారి అనిల్ రావిపూడికి పోటీపరంగా భారీ ఛాలెంజులు ఉన్నాయి. ప్రభాస్ ది రాజా సాబ్ పెద్ద ఎత్తున బరిలో దిగుతున్నాడు. అది కూడా అందరి కంటే ముందు. జనవరి 9 విడుదల కాబోతున్న ఈ హారర్ డ్రామా మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ 77 కూడా ఎంటర్ టైన్మెంట్ జానర్ లో రూపొందినవే. విజయ్ జన నాయకుడు డబ్బింగ్ అయినా మరీ తక్కువంచనా వేయడానికి లేదు. సో ఇంత కాంపిటీషన్ లో జనాన్ని తనవైపు లాగాలంటే మెగాస్టార్ బ్రాండ్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో క్వాలిటీ కామెడీ ఉందనే నమ్మకం కలిగించాలి.
అందుకే ముందు జాగ్రత్తగా ఇంత అడ్వాన్స్ గా హడావిడి మొదలుపెడుతున్నారు. రాజా సాబ్ ఇప్పటిదాకా ఆరు నిమిషాల వీడియో కంటెంట్ వదిలింది. సంక్రాంతి సినిమాల్లో ఇంత స్పీడ్ గా వేరేవరిది లేదు. అందుకే అనిల్ రావిపూడికి స్పెషల్ ప్లాన్ అవసరమవుతుంది. భీమ్స్ పాటలు, నయనతార గ్లామర్, వెంకటేష్ ప్రత్యేక పాత్ర, బుల్లిరాజు క్యారెక్టర్ ఇలాంటి ఆకర్షణలు అన్నింటిని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ హైప్ ఎలా పెంచాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. రేపు రాబోయే ప్రోమో అనౌన్స్ మెంట్ తోనే మొదటి ఇంప్రెషన్ బలంగా పడుతుందని అంటున్నారు. చూడాలి మరి అనిల్ మార్కు ఎలా ఉండబోతోందో.
This post was last modified on October 1, 2025 11:16 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…