బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు ఈ మధ్య తరచుగా వివాదాల్లో నానుతోంది. వర్కింగ్ అవర్స్, మరి కొన్ని విషయాల్లో ఆమె పెడుతున్న కండిషన్లను తట్టుకోలేక ఆమెకు నిర్మాతలు టాటా చెప్పేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే బిడ్డకు తల్లి అయిన దీపిక.. పని వేళల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటోందని.. ఆ మేరకు నిర్మాతలకు షరతులు పెడుతోందని.. అలాగే పారితోషకం ఎక్కువ డిమాండ్ చేస్తోందని.. అదనపు ఖర్చుల మోత కూడా పెరిగిపోతోందనే చర్చ ఊపందుకుంది.
దీని వల్ల స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి ఆమె తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. బాలీవుడ్లో కూడా చాలామంది ఆమె తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు సన్నిహితురాలైన దర్శకురాలు ఫరా ఖాన్.. ఒక టీవీ షోలో తనను ఉద్దేశించి పంచ్ వేయడం హాట్ టాపిక్గా మారింది. తాను పాల్గొన్న టీవీ షోకు దీపిక కూడా వస్తే ఎలా ఉంటుందనే విషయమై ఫరా ఖాన్ సరదాగా స్పందించింది. ‘‘ఆమె పని చేసేదే 8 గంటలు. ఇక ఈ షోకు ఎలా వస్తుంది? ఆమెకు అంత టైం ఎక్కడుంది’’ అని ఫరా వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూయర్ సినిమాలకు ఫరాతో కలిసి పని చేసిన దీపికకు ఆమెతో సన్నిహిత సంబంధాలే ఉండేవి. ఐతే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తన ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేసేలా ఈ కామెంట్ ఉండడంతో ఫరాను దీపిక సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య మాటలు కూడా ఆగిపోయాయని అంటున్నారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో ఫరా స్పందించింది. తాము చాన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవట్లేదన్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ టైంలోనే తమ మధ్య ఒక ఒప్పందం జరిగిందని.. పరస్పరం నేరుగా మాట్లాడుకోవాలని, సోషల్ మీడియాలో కాన్వర్జేషన్లు ఏమీ వద్దనుకున్నామని.. దీపికకు ఇలాంటివి నచ్చవని.. కాబట్టి ఒకరినొకరు అన్ ఫాలో కావడం లాంటిదేమీ లేదని.. ఇప్పుడు కొత్తగా తమ మధ్య వివాదం ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…