రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలుగానే టికెట్ల ధరలు తక్కువేమీ కాదు. దేశం మొత్తంలో అధిక రేట్లున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ముందు వరుసలోనే ఉంటాయి. అయినా సరే.. ఉన్న రేట్లు సరిపోవని.. కాస్త క్రేజున్న ప్రతి సినిమాకూ అదనపు రేట్లు వడ్డించడం మామూలైపోయింది. వందల కోట్లు ఖర్చు పెట్టి, ఎంతో భారీగా తీసిన సినిమాలకు ఎక్స్ట్రా రేట్లు పెట్టినా ఓకే కానీ.. మామూలు చిత్రాలకు కూడా రేట్లు వడ్డిస్తుండడం జనాల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది.
మరీ విడ్డూరమైన విషయం ఏంటంటే.. డబ్బింగ్ సినిమాలకు సైతం అదనపు రేట్లు అడగడం, ప్రభుత్వాలు ఓకే చెప్పడం. గత నెలలో వచ్చిన వార్-2, కూలీ రెండూ డబ్బింగ్ సినిమాలే. అయినా వాటికి ఏపీలో రేట్లు పెంచారు. ఇప్పుడు మరో అనువాద చిత్రానికి ఎక్స్ట్రా రేట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా జీవో ఇవ్వబోతోందనే ప్రచారం సాగుతుంది. ఆ మూవీనే.. కాంతార: చాప్టర్-1.
‘కాంతార’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ‘కాంతార: చాప్టర్-1’ మీద అంచనాలు పెరిగాయి. బిజినెస్ కూడా గట్టిగా జరిగింది. మరి సినిమాకు హైప్ పెరగడానికి కారణం ఎవరు? ప్రేక్షకులే కదా? వాళ్లలో అంచనాలు పెరగడం వల్లే కదా రేటు పెరిగింది, అందుకే భారం కూడా వాళ్ల మీదే వేద్దామని అనుకుంటున్నట్లున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఒక సినిమా పట్ల హైప్ పెంచుకోవడమే ప్రేక్షకుల పాపం అన్నమాట.
ఓవైపు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని.. వెండితెరల భవిష్యత్ ఏంటి అంటూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇంకోవైపు ఏదైనా సినిమాను థియేటర్లకు వచ్చి చూద్దాం అనుకుంటే.. ఆ క్రేజ్ను క్యాష్ చేసుకుంటూ రేట్లు పెంచేస్తారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తాయన్నదే అంతుబట్టని విషయం. తెలంగాణలో ‘ఓజీ’కి టికెట్ల ధరలు పెంచడం మీద రచ్చ జరిగిన నేపథ్యంలో ‘కాంతార-2’ సహా ఇకపై ఏ చిత్రానికీ అదనపు రేట్లు ఉండవని తెలుస్తోంది.
This post was last modified on September 29, 2025 9:08 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…