రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలుగానే టికెట్ల ధరలు తక్కువేమీ కాదు. దేశం మొత్తంలో అధిక రేట్లున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ముందు వరుసలోనే ఉంటాయి. అయినా సరే.. ఉన్న రేట్లు సరిపోవని.. కాస్త క్రేజున్న ప్రతి సినిమాకూ అదనపు రేట్లు వడ్డించడం మామూలైపోయింది. వందల కోట్లు ఖర్చు పెట్టి, ఎంతో భారీగా తీసిన సినిమాలకు ఎక్స్ట్రా రేట్లు పెట్టినా ఓకే కానీ.. మామూలు చిత్రాలకు కూడా రేట్లు వడ్డిస్తుండడం జనాల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది.
మరీ విడ్డూరమైన విషయం ఏంటంటే.. డబ్బింగ్ సినిమాలకు సైతం అదనపు రేట్లు అడగడం, ప్రభుత్వాలు ఓకే చెప్పడం. గత నెలలో వచ్చిన వార్-2, కూలీ రెండూ డబ్బింగ్ సినిమాలే. అయినా వాటికి ఏపీలో రేట్లు పెంచారు. ఇప్పుడు మరో అనువాద చిత్రానికి ఎక్స్ట్రా రేట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా జీవో ఇవ్వబోతోందనే ప్రచారం సాగుతుంది. ఆ మూవీనే.. కాంతార: చాప్టర్-1.
‘కాంతార’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ‘కాంతార: చాప్టర్-1’ మీద అంచనాలు పెరిగాయి. బిజినెస్ కూడా గట్టిగా జరిగింది. మరి సినిమాకు హైప్ పెరగడానికి కారణం ఎవరు? ప్రేక్షకులే కదా? వాళ్లలో అంచనాలు పెరగడం వల్లే కదా రేటు పెరిగింది, అందుకే భారం కూడా వాళ్ల మీదే వేద్దామని అనుకుంటున్నట్లున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఒక సినిమా పట్ల హైప్ పెంచుకోవడమే ప్రేక్షకుల పాపం అన్నమాట.
ఓవైపు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని.. వెండితెరల భవిష్యత్ ఏంటి అంటూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇంకోవైపు ఏదైనా సినిమాను థియేటర్లకు వచ్చి చూద్దాం అనుకుంటే.. ఆ క్రేజ్ను క్యాష్ చేసుకుంటూ రేట్లు పెంచేస్తారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తాయన్నదే అంతుబట్టని విషయం. తెలంగాణలో ‘ఓజీ’కి టికెట్ల ధరలు పెంచడం మీద రచ్చ జరిగిన నేపథ్యంలో ‘కాంతార-2’ సహా ఇకపై ఏ చిత్రానికీ అదనపు రేట్లు ఉండవని తెలుస్తోంది.
This post was last modified on September 29, 2025 9:08 am
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…