రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలుగానే టికెట్ల ధరలు తక్కువేమీ కాదు. దేశం మొత్తంలో అధిక రేట్లున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ముందు వరుసలోనే ఉంటాయి. అయినా సరే.. ఉన్న రేట్లు సరిపోవని.. కాస్త క్రేజున్న ప్రతి సినిమాకూ అదనపు రేట్లు వడ్డించడం మామూలైపోయింది. వందల కోట్లు ఖర్చు పెట్టి, ఎంతో భారీగా తీసిన సినిమాలకు ఎక్స్ట్రా రేట్లు పెట్టినా ఓకే కానీ.. మామూలు చిత్రాలకు కూడా రేట్లు వడ్డిస్తుండడం జనాల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది.
మరీ విడ్డూరమైన విషయం ఏంటంటే.. డబ్బింగ్ సినిమాలకు సైతం అదనపు రేట్లు అడగడం, ప్రభుత్వాలు ఓకే చెప్పడం. గత నెలలో వచ్చిన వార్-2, కూలీ రెండూ డబ్బింగ్ సినిమాలే. అయినా వాటికి ఏపీలో రేట్లు పెంచారు. ఇప్పుడు మరో అనువాద చిత్రానికి ఎక్స్ట్రా రేట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా జీవో ఇవ్వబోతోందనే ప్రచారం సాగుతుంది. ఆ మూవీనే.. కాంతార: చాప్టర్-1.
‘కాంతార’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ‘కాంతార: చాప్టర్-1’ మీద అంచనాలు పెరిగాయి. బిజినెస్ కూడా గట్టిగా జరిగింది. మరి సినిమాకు హైప్ పెరగడానికి కారణం ఎవరు? ప్రేక్షకులే కదా? వాళ్లలో అంచనాలు పెరగడం వల్లే కదా రేటు పెరిగింది, అందుకే భారం కూడా వాళ్ల మీదే వేద్దామని అనుకుంటున్నట్లున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఒక సినిమా పట్ల హైప్ పెంచుకోవడమే ప్రేక్షకుల పాపం అన్నమాట.
ఓవైపు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని.. వెండితెరల భవిష్యత్ ఏంటి అంటూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇంకోవైపు ఏదైనా సినిమాను థియేటర్లకు వచ్చి చూద్దాం అనుకుంటే.. ఆ క్రేజ్ను క్యాష్ చేసుకుంటూ రేట్లు పెంచేస్తారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తాయన్నదే అంతుబట్టని విషయం. తెలంగాణలో ‘ఓజీ’కి టికెట్ల ధరలు పెంచడం మీద రచ్చ జరిగిన నేపథ్యంలో ‘కాంతార-2’ సహా ఇకపై ఏ చిత్రానికీ అదనపు రేట్లు ఉండవని తెలుస్తోంది.
This post was last modified on September 29, 2025 9:08 am
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…