రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలుగానే టికెట్ల ధరలు తక్కువేమీ కాదు. దేశం మొత్తంలో అధిక రేట్లున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ముందు వరుసలోనే ఉంటాయి. అయినా సరే.. ఉన్న రేట్లు సరిపోవని.. కాస్త క్రేజున్న ప్రతి సినిమాకూ అదనపు రేట్లు వడ్డించడం మామూలైపోయింది. వందల కోట్లు ఖర్చు పెట్టి, ఎంతో భారీగా తీసిన సినిమాలకు ఎక్స్ట్రా రేట్లు పెట్టినా ఓకే కానీ.. మామూలు చిత్రాలకు కూడా రేట్లు వడ్డిస్తుండడం జనాల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది.
మరీ విడ్డూరమైన విషయం ఏంటంటే.. డబ్బింగ్ సినిమాలకు సైతం అదనపు రేట్లు అడగడం, ప్రభుత్వాలు ఓకే చెప్పడం. గత నెలలో వచ్చిన వార్-2, కూలీ రెండూ డబ్బింగ్ సినిమాలే. అయినా వాటికి ఏపీలో రేట్లు పెంచారు. ఇప్పుడు మరో అనువాద చిత్రానికి ఎక్స్ట్రా రేట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా జీవో ఇవ్వబోతోందనే ప్రచారం సాగుతుంది. ఆ మూవీనే.. కాంతార: చాప్టర్-1.
‘కాంతార’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ‘కాంతార: చాప్టర్-1’ మీద అంచనాలు పెరిగాయి. బిజినెస్ కూడా గట్టిగా జరిగింది. మరి సినిమాకు హైప్ పెరగడానికి కారణం ఎవరు? ప్రేక్షకులే కదా? వాళ్లలో అంచనాలు పెరగడం వల్లే కదా రేటు పెరిగింది, అందుకే భారం కూడా వాళ్ల మీదే వేద్దామని అనుకుంటున్నట్లున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఒక సినిమా పట్ల హైప్ పెంచుకోవడమే ప్రేక్షకుల పాపం అన్నమాట.
ఓవైపు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని.. వెండితెరల భవిష్యత్ ఏంటి అంటూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇంకోవైపు ఏదైనా సినిమాను థియేటర్లకు వచ్చి చూద్దాం అనుకుంటే.. ఆ క్రేజ్ను క్యాష్ చేసుకుంటూ రేట్లు పెంచేస్తారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తాయన్నదే అంతుబట్టని విషయం. తెలంగాణలో ‘ఓజీ’కి టికెట్ల ధరలు పెంచడం మీద రచ్చ జరిగిన నేపథ్యంలో ‘కాంతార-2’ సహా ఇకపై ఏ చిత్రానికీ అదనపు రేట్లు ఉండవని తెలుస్తోంది.
This post was last modified on September 29, 2025 9:08 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…