అక్టోబర్ 2 విడుదల కాబోతున్న కాంతార చాప్టర్ 1 ది లెజెండ్ చేతిలో ఇంకో పన్నెండు రోజులు మాత్రమే ఉన్నా ప్రమోషన్లు ఊపందుకోకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోనీ వాయిదా ఏమైనా ఉందా అంటే ఆ డౌట్ అక్కర్లేదనేలా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. కర్ణాటకలో టికెట్ రేట్లను గరిష్టంగా 200 రూపాయలకు పరిమితం చేయడం గురించి కోర్టుకు వెళ్లిన హోంబాలే ఫిలిమ్స్ అక్కడి ఫిలిం ఛాంబర్ నుంచి వ్యతిరేకతను ఎదురుకోవడం ఊహించని పరిణామం. ఆన్ లైన్ వేదికగా శాండల్ వుడ్ ఫ్యాన్స్ ఇలా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే వారం వెల్లడి కాబోతున్న తీర్పు కనక అనుకూలంగా రాకపోతే కాంతార నిర్మాతలు ఏం చేస్తారనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. నిర్మాత కం హీరో రిషబ్ శెట్టికి ఇదంతా పట్టించుకునే టైం లేదు. చివరి దశ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయకపోయినా తన సినిమా ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ తీసుకొస్తుందనే నమ్మకం తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నాడట. తల మీద విపరీతమైన హైప్ ఉన్న ఓజిని పెట్టుకుని కాంతార ఇంత నిమ్మళంగా ఉండటం అంతుచిక్కని విషయం. మొదటి భాగానికి ప్రచారం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడీ సీక్వెల్ కి హడావిడి చేయడం చాలా అవసరం. ట్రైలర్ ని సోమవారం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది ఎలా ఉందనే దాని మీద హైప్ ఆధారపడి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల హక్కులకు వంద కోట్ల దాకా డిమాండ్ చేశారనే టాక్ వచ్చింది. ఇప్పుడది డెబ్భై కోట్ల దగ్గర క్లోజ్ అవ్వొచ్చని ఇన్ సైడ్ టాక్. మైత్రి హక్కులు తీసుకున్నా ఎంత మొత్తమనేది అఫీషియల్ గా బయటికి రాలేదు. కాంతారకు పోటీ ఒక్క ఓజి రూపంలోనే లేదు. తమిళంలో ధనుష్ ఇడ్లీ కడాయిని తక్కువంచనా వేయడానికి లేదు. మంచి ఎమోషనల్ డ్రామాతో ధనుష్ ఈసారి సర్ప్రైజ్ చేస్తాడని చెన్నై మీడియా టాక్. అదే నిజమైతే ఇటు ఓజి, అటు ఇడ్లి కొట్టు మధ్య కాంతార చేయాల్సిన యుద్ధం కాస్త పెద్దదిగానే ఉంటుంది. ఎంత కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నా మరీ ఇంత నెమ్మదిగా ఉంటే రిస్క్ అయ్యేలా ఉంది.
This post was last modified on September 19, 2025 1:52 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…