భారీ అంచనాల మధ్య రిలీజై.. ఆ అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర ఇరగాడేస్తోంది ‘మిరాయ్’ సినిమా. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ పాన్ ఇండియ ా స్థాయిలో మరో పెద్ద హిట్ కొట్టినట్లే కనిపిస్తున్నాడు. ఈ చిత్రం తొలి వీకెండ్లోనే రూ.82 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది. హిందీలో కూడా వసూళ్లు స్టడీగా ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ పది కోట్ల మార్కును దాటేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ కావడానికి రాముడి పాత్ర కూడా ఓ కారణం.
ఉత్తరాది జనాలు రాముడి పాత్రను తెరపై ఎఫెక్టివ్గా చూపిస్తే ఉద్వేగానికి గురవుతారు. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ను చూపించింది కాసేపే అయినా.. ఆ సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. ఐతే సినిమాలో రాముడి పాత్రను ఎవరు పోషించారనే విషయంలో మాత్రం ఆడియన్స్కు క్లారిటీ రాలేదు. మనకు తెలిసిన నటుడెవరైనా ఆ పాత్ర చేశారా అని ఆసక్తిగా చూస్తే.. పరిచయం లేని రూపం కనిపించింది. ‘కల్కి’లో శ్రీకృష్ణుడి పాత్ర తరహాలోనే లుక్ క్లియర్గా కనిపించలేదు. కొందరు ఇది ఏఐ క్రియేషన్ అనే సందేహాలు కూడా వ్యక్తం చేశారు.
కానీ అది నిజం కాదు. నార్త్ ఇండియాకు చెందిన ఒక థియేటర్ ఆర్టిస్ట్ కమ్ మోడల్ ఈ పాత్రను పోషించాడు. తన పేరు.. గౌరవ్ బోరా. అతను అనే థియేటర్ ప్లేస్, యాడ్ ఫిల్మ్స్లో నటించాడు. ‘మిరాయ్’ కోసం ఆడిషన్ ఇచ్చి మరీ అతను రాముడి పాత్రకు సెలక్ట్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో తనకీ అవకాశం దక్కడం పట్ల అతను అమితానందం వ్యక్తం చేశాడు. సినిమాలో తన ముఖం సరిగా కనిపించకపోయినా సరే.. రాముడి పాత్రలో కనిపించడమే ఒక వరం అంటూ అతను ఉద్వేగానికి గురయ్యాడు. ఈ సినిమా తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని గౌరవ్ బోరా ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…