భారీ అంచనాల మధ్య రిలీజై.. ఆ అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర ఇరగాడేస్తోంది ‘మిరాయ్’ సినిమా. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ పాన్ ఇండియ ా స్థాయిలో మరో పెద్ద హిట్ కొట్టినట్లే కనిపిస్తున్నాడు. ఈ చిత్రం తొలి వీకెండ్లోనే రూ.82 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది. హిందీలో కూడా వసూళ్లు స్టడీగా ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ పది కోట్ల మార్కును దాటేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ కావడానికి రాముడి పాత్ర కూడా ఓ కారణం.
ఉత్తరాది జనాలు రాముడి పాత్రను తెరపై ఎఫెక్టివ్గా చూపిస్తే ఉద్వేగానికి గురవుతారు. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ను చూపించింది కాసేపే అయినా.. ఆ సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. ఐతే సినిమాలో రాముడి పాత్రను ఎవరు పోషించారనే విషయంలో మాత్రం ఆడియన్స్కు క్లారిటీ రాలేదు. మనకు తెలిసిన నటుడెవరైనా ఆ పాత్ర చేశారా అని ఆసక్తిగా చూస్తే.. పరిచయం లేని రూపం కనిపించింది. ‘కల్కి’లో శ్రీకృష్ణుడి పాత్ర తరహాలోనే లుక్ క్లియర్గా కనిపించలేదు. కొందరు ఇది ఏఐ క్రియేషన్ అనే సందేహాలు కూడా వ్యక్తం చేశారు.
కానీ అది నిజం కాదు. నార్త్ ఇండియాకు చెందిన ఒక థియేటర్ ఆర్టిస్ట్ కమ్ మోడల్ ఈ పాత్రను పోషించాడు. తన పేరు.. గౌరవ్ బోరా. అతను అనే థియేటర్ ప్లేస్, యాడ్ ఫిల్మ్స్లో నటించాడు. ‘మిరాయ్’ కోసం ఆడిషన్ ఇచ్చి మరీ అతను రాముడి పాత్రకు సెలక్ట్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో తనకీ అవకాశం దక్కడం పట్ల అతను అమితానందం వ్యక్తం చేశాడు. సినిమాలో తన ముఖం సరిగా కనిపించకపోయినా సరే.. రాముడి పాత్రలో కనిపించడమే ఒక వరం అంటూ అతను ఉద్వేగానికి గురయ్యాడు. ఈ సినిమా తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని గౌరవ్ బోరా ఆశాభావం వ్యక్తం చేశాడు.
This post was last modified on September 15, 2025 10:17 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…