‘హనుమాన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు తేజ సజ్జ. ఆ సినిమాకు ముందు హీరోగా తనేమంత పాపులర్ కాదు. బాల నటుడిగా చాలా సినిమాలు చేసినప్పటికీ.. ఓ బేబీ, జాంబి రెడ్డి సినిమాలతో తనకు వచ్చిన గుర్తింపు తక్కువే. కానీ ‘హనుమాన్’తో తన కెరీర్ మారిపోయింది. అలా అని అంతకుముందు అతను కెరీర్లో ఇబ్బందులు పడకుండా ఏమీ లేదు. హీరో కావాలనుకున్నపుడు అవకాశాల కోసం అతనూ దర్శక నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక పెద్ద దర్శకుడు తనను ఎలా ఆశ చూపి ఎలా దెబ్బ కొట్టాడో ‘మిరాయ్’కి సంబంధించిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు తేజ.
తాను హీరో అవ్వాలనుకున్నపుడు ఎన్నో కష్టాలు పడ్డానని.. మోసాలు, రిజెక్షన్లు, అవమానాలు అన్నీ చూశానని తేజ తెలిపాడు. తనను మోసం చేసిన వాళ్లలో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారని అతనన్నాడు. ఒక స్టార్ డైరెక్టర్ తనకు కథ చెప్పి షూటింగ్ మొదలు పెట్టాడని.. 15 రోజులు షూటింగ్ కూడా చేశాడని.. కానీ ఒక రోజు హఠాత్తుగా సెట్స్కు ఇంకో హీరో వచ్చాడని.. ఆ సినిమాలో అతనే హీరో అని అప్పుడు తనకు అర్థమైందని తేజ వెల్లడించాడు. తన కంటే ముందు ఆ హీరోకు కథ చెప్పిన ఆ దర్శకుడు.. తనకు సీన్స్ చూపించడం కోసం తనతో మాక్ షూట్ చేశాడని తర్వాత తెలిసిందని తేజ బాధాకరమైన విషయాన్ని బయటపెట్టాడు.
ఇది ఎలాంటి వ్యక్తికైనా ఎంతో బాధ కలిగించే విషయం అనడంలో సందేహం లేదు. ఓ వర్ధమాన నటుడితో మరీ అంత దుర్మార్గంగా వ్యవహరించిన ఆ దర్శకుడు ఎవరో మరి? ఇక బాల నటుడిగా చాలా సినిమాలు చేసినప్పటికీ.. తనకు బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల హీరో అవుతానంటే ఇంట్లో వాళ్లు భయపడ్డారని తేజ తెలిపాడు. ‘చూడాలని ఉంది’లో బాల నటుడి కోసం చిరు దగ్గరికి చాలా ఫొటోలు వచ్చాయని.. ఆయన తన ఫొటోనే సెలక్ట్ చేశారని.. ఆయన ఆ రోజు అలా చేసి ఉండకపోతే తాను ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదని తేజ అన్నాడు.
This post was last modified on September 9, 2025 6:23 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…