‘హనుమాన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు తేజ సజ్జ. ఆ సినిమాకు ముందు హీరోగా తనేమంత పాపులర్ కాదు. బాల నటుడిగా చాలా సినిమాలు చేసినప్పటికీ.. ఓ బేబీ, జాంబి రెడ్డి సినిమాలతో తనకు వచ్చిన గుర్తింపు తక్కువే. కానీ ‘హనుమాన్’తో తన కెరీర్ మారిపోయింది. అలా అని అంతకుముందు అతను కెరీర్లో ఇబ్బందులు పడకుండా ఏమీ లేదు. హీరో కావాలనుకున్నపుడు అవకాశాల కోసం అతనూ దర్శక నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక పెద్ద దర్శకుడు తనను ఎలా ఆశ చూపి ఎలా దెబ్బ కొట్టాడో ‘మిరాయ్’కి సంబంధించిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు తేజ.
తాను హీరో అవ్వాలనుకున్నపుడు ఎన్నో కష్టాలు పడ్డానని.. మోసాలు, రిజెక్షన్లు, అవమానాలు అన్నీ చూశానని తేజ తెలిపాడు. తనను మోసం చేసిన వాళ్లలో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారని అతనన్నాడు. ఒక స్టార్ డైరెక్టర్ తనకు కథ చెప్పి షూటింగ్ మొదలు పెట్టాడని.. 15 రోజులు షూటింగ్ కూడా చేశాడని.. కానీ ఒక రోజు హఠాత్తుగా సెట్స్కు ఇంకో హీరో వచ్చాడని.. ఆ సినిమాలో అతనే హీరో అని అప్పుడు తనకు అర్థమైందని తేజ వెల్లడించాడు. తన కంటే ముందు ఆ హీరోకు కథ చెప్పిన ఆ దర్శకుడు.. తనకు సీన్స్ చూపించడం కోసం తనతో మాక్ షూట్ చేశాడని తర్వాత తెలిసిందని తేజ బాధాకరమైన విషయాన్ని బయటపెట్టాడు.
ఇది ఎలాంటి వ్యక్తికైనా ఎంతో బాధ కలిగించే విషయం అనడంలో సందేహం లేదు. ఓ వర్ధమాన నటుడితో మరీ అంత దుర్మార్గంగా వ్యవహరించిన ఆ దర్శకుడు ఎవరో మరి? ఇక బాల నటుడిగా చాలా సినిమాలు చేసినప్పటికీ.. తనకు బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల హీరో అవుతానంటే ఇంట్లో వాళ్లు భయపడ్డారని తేజ తెలిపాడు. ‘చూడాలని ఉంది’లో బాల నటుడి కోసం చిరు దగ్గరికి చాలా ఫొటోలు వచ్చాయని.. ఆయన తన ఫొటోనే సెలక్ట్ చేశారని.. ఆయన ఆ రోజు అలా చేసి ఉండకపోతే తాను ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదని తేజ అన్నాడు.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…