రేపు బాలీవుడ్ మూవీ బాఘీ 4 విడుదలవుతోంది. టైగర్ శ్రోఫ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శాండల్ వుడ్ దర్శకుడు హర్ష డైరెక్షన్ చేశాడు. గతంలో గోపీచంద్ భీమా తీసింది ఇతనే. వర్షం రీమేక్ గా మొదలైన బాఘీ ఫ్రాంచైజ్ తర్వాత మాస్ పేరుతో క్రమంగా దారి తప్పుతూ ఓవర్ కమర్షియల్ డ్రామాగా మారిపోయింది. ఇప్పుడు నాలుగో భాగం రెడీ చేశారు. టీజర్ తో జనాలను భయపెట్టిన టీమ్ ట్రైలర్ తో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. సెన్సార్ దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమి లేదు కానీ నార్త్ వర్గాల్లో దీనికిచ్చిన కట్స్ గురించి చెబుతున్న కథనాలు ఓ రేంజ్ లో షాక్ కొట్టిస్తున్నాయి.
మొత్తం 23 విజువల్స్ కి సంబంధించి సెన్సార్ బోర్డు కట్స్ చెప్పిందట. శవపేటిక మీద నిలబడిన హీరో సీన్, తెగిపడిన చేయితో సిగరెట్ వెలిగించుకోవడం, పాక్షిక నగ్నంగా ఉంటూ అభ్యంతరం అనిపించే మరో సన్నివేశం, ఒక అమ్మాయిని అసభ్యం అనిపించేలా తాకే సీన్, కత్తులతో రౌడీలను పరమ కిరాతకంగా నరికేసే పదకొండు సెకండ్ల షాట్ ఇలా బోలెడు అభ్యంతరాలతో టీమ్ కు చాలా మార్పులు సూచించారట. ఇక్కడ రాయలేనివి కొన్ని ఉన్నాయి ఇక ఆడియో మ్యూట్స్ బోలెడు ఉన్నాయట. సుమారు 6 నిమిషాల 37 సెకండ్లు కత్తిరించుకుని వచ్చాక సెన్సార్ తో ఏ సర్టిఫికెట్ తీసుకున్నట్టు సమాచారం.
బహుశా దర్శకుడు హర్ష మార్కోని స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఉన్నాడు. అందులో హద్దుమీరిన హింస జనాన్ని థియేటర్లకు తీసుకొచ్చింది. కానీ జుగుప్స అనిపించే వయొలెన్స్ ని చాలా మంది ఏవగించుకున్నారు. హిందీ, తెలుగు లాంటి భాషల్లో ఆడియన్స్ ఆదరించలేదు. మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సో ఉన్ని ముకుందన్ మీద అంత హింస పండినప్పుడు టైగర్ శ్రోఫ్ కి దానికి పదింతలు ఉండాలని డిసైడ్ అయ్యారు కాబోలు. అయినా రాను రాను హద్దులు దాటుతున్న ఈ ట్రెండ్ ని సెన్సార్ అడ్డుకట్ట వేయడం పక్కన పెడితే ఫిలిం మేకర్స్ కూడా తమ కంటెంట్ ప్రభావం గురించి కొంత సీరియస్ గా ఆలోచించాలి.
This post was last modified on September 4, 2025 12:45 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…