ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ హంగామాతో సోషల్ మీడియా ఊగిపోయింది. నిన్న సాయంత్రం విశ్వంభరతో మొదలైన హడావిడి ఇవాళ మన శంకరవరప్రసాద్ గారు టైటిల్ లాంచ్, చిరు బాబీ కాన్సెప్ట్ పోస్టర్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. అయితే ఇన్ని వీడియోలు, లుక్కులను మించిన ఎలివేషన్ శ్రీకాంత్ ఓదెల జస్ట్ ఒక ట్వీట్ తో ఇచ్చిపారేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. నా చిరంజీవిని మిస్సవుతూ వచ్చానని, నేను వెనక్కు తీసుకొస్తానని, ఇది రక్తంతో చేస్తున్న ప్రమాణమంటూ ఓ రేంజ్ లో గూస్ బంప్స్ పదాలతో ట్వీట్ నింపిన తీరు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉంది.
జీవిత కాలం ఆడే సినిమా చిరంజీవి, అలాంటిది చిరంజీవితోనే సినిమా అంటే జీవితాంతం గుర్తుండిపోయేలా తీయాలని, ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదని చెప్పడం శ్రీకాంత్ ఓదెల ఫ్యానిజంని పూర్తిగా బయట పెట్టేసింది. స్వయంగా అతని తల్లి ఫోటోలో నిన్నెప్పుడు నవ్వుతూ చూడలేదని, ఇప్పుడు చూశానని చిరంజీవితో కలిసి ఉన్న పిక్ ని ఉద్దేశించి చెప్పడం మరో ఎలివేషన్. నిన్న ఈరోజు చిరంజీవిని ఎందరో విష్ చేశారు కానీ ఈ స్థాయిలో ఊపేసింది మాత్రం శ్రీకాంత్ ఓదెల ఒక్కడే. దెబ్బకు ట్వీట్ వైరల్ అయిపోయి ఎక్కడ చూసినా దీని గురించిన చర్చలే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు తెరకెక్కడానికి ఇంకా టైం పడుతుంది. శ్రీకాంత్ ఓదెల ముందు నాని ది ప్యారడైజ్ పూర్తి చేయాలి. ఇది మార్చ్ లో రిలీజ్ అయ్యాక అప్పుడు మెగా 159 పనులు మొదలవుతాయి. ఈలోగా మన శంకరవరప్రసాద్ గారు, విశ్వంభర రిలీజైపోతాయి. బాబీతో చేస్తున్న సినిమా వేసవికంతా కొలిక్కి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఓదెలనే ఉంటాడు. నాని నిర్మాతగా వ్యవహరించబోతున్న మెగా 159లో హీరోయిన్ ని ఇంకా ఖరారు చేయలేదు. టెక్నికల్ టీమ్ ఫైనల్ కాలేదు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తోంది కానీ ఫైనల్ అయితే చేయలేదు. దీని అప్డేట్స్ ఇంకో ఆరేడు నెలల వరకు ఆశించలేం.
This post was last modified on August 22, 2025 8:16 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…