టాలీవుడ్లో మరే నిర్మాతకూ సాధ్యం కాని సక్సెస్ రేట్తో దూసుకెళ్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు సూర్యదేవర నాగవంశీ. అతడి బేనర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఓ సినిమా వస్తోందంటే.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు నమ్మకంతో థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించింది. అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం వంశీని చూస్తే ఒకప్పటి తనను చూసుకున్నట్లు అనిపిస్తోందని.. అంత బాగా సినిమాలు తీస్తున్నాడని ఓ సందర్భంలో ప్రశంసలు కురిపించడం విశేషం.
వంశీ ప్రొడ్యూస్ చేసే సినిమాలతో పాటు అతను డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలకూ మంచి ఫలితాలు అందుకోవడంతో టాలీవుడ్లో గోల్డెన్ హ్యాండ్గా గుర్తింపు తెచ్చుకున్నాడతను. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సక్సెస్లతో కొనసాగడం కష్టం కాదు. సినీ నిర్మాణం జూదంలా మారిపోయిన ఈ రోజుల్లో జాతకాలు తిరగబడడానికి ఎంతో సమయం పట్టదు. అందుకు నాగవంశీ కూడా మినహాయింపు కాలేకపోతున్నాడు.
జులై నెలాఖరు నుంచి నెల రోజుల వ్యవధిలో మూడు క్రేజీ చిత్రాల విడుదల పెట్టుకున్నాడు నాగవంశీ. ఈ మూడు చిత్రాల తనకు మంచి ఫలితాలనిచ్చి ఇండస్ట్రీలో తన పేరు మార్మోగేలా చేస్తాయని ఆశించాడు. కానీ ఒక్కో సినిమా ఆయన్ని కిందికి లాగేస్తోంది. ముందుగా విజయ్ దేవరకొండతో భారీ బడ్జెట్ పెట్టి తీసిన ‘కింగ్డమ్’ నాగవంశీని గట్టి దెబ్బ కొట్టింది. వీకెండ్ వరకు ఓకే అనిపించిన ఈ చిత్రం.. తర్వాత క్రాష్ అయిపోయింది. విజయ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది బాగా ఆడినా.. నష్టాలు విషయంలో మాత్రం ఇదేమీ తక్కువ కాదు. ఎక్కువ బడ్జెట్ పెట్టడం వల్ల నష్టాలు ఎక్కువే వచ్చాయి.
ఐతే ఆ నష్టాలను ఎన్టీఆర్ సినిమా ‘వార్-2’ భర్తీ చేస్తుందనుకుంటే.. ఇది ఇంకా పెద్ద దెబ్బ కొట్టేలా ఉంది. ఏకంగా రూ.80 కోట్లు పెట్టి తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాడు నాగవంశీ. కానీ ‘కూలీ’తో పోటీలో ఈ సినిమా రిలీజ్ ముంగిటే వెనుకబడిపోయింది. పైగా బ్యాడ్ టాక్ రావడంతో వసూళ్లు అంచనాలకు తగ్గట్లు లేవు. పెట్టుబడిలో సగం వెనక్కి రావడం కూడా కష్టంగా ఉంది. వీకెండ్ తర్వాత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండబోతోందన్నది స్పష్టం. మరోవైపు రవితేజ సినిమా ‘మాస్ జాతర’ మీద ఉన్న అంచనాలు టీజర్ తర్వాత తగ్గిపోయాయి. దీంతో ఈ నెల 27న సినిమాను రిలీజ్ చేయట్లేదని, వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్, వేసవిలో మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో హిట్లు కొట్టి ఖుషీగా ఉన్న నాగవంశీ.. ఇంతలోనే వరుస ఎదురుదెబ్బలతో కుదేలైపోయైపోయే పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…