Movie News

మల్లీశ్వరిని మించిన మేజిక్ కావాలి

అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. హారిక హాసిని బ్యానర్ మీద రూపొందబోయే ఎంటర్ టైనర్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా మెగా 157 తర్వాత వెంకటేష్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కానుంది. మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కు పేరు రావడానికి దోహదం చేసినవి వెంకీ మూవీసే. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. వీటిలో మొదటి రెండింటికి దర్శకుడు విజయ్ భాస్కర్ అయినా యంగ్ ఆడియన్స్ చాలా మంది వాటిని డైరెక్ట్ చేసింది త్రివిక్రమే అని పొరపడుతుంటారు.

అంతగా పెనవేసుకుపోయిన ఈ కలయికలో మల్లీశ్వరిని మించిన మేజిక్ జరగాలని  సినీ ప్రియులు కోరుతున్నారు. నిజానికిది ఏడెనిమిదేళ్ల క్రితం తెరకెక్కాల్సిన ప్రాజెక్టు. అప్పట్లో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈలోగా ఇద్దరూ ఎవరి కమిట్ మెంట్లో వాళ్ళు బిజీ కావడంతో ఎంత అనుకున్నా కుదరలేదు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయాల్సిన ఫాంటసీ మూవీ క్యాన్సిలయ్యాక దాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో లాక్ చేసుకున్నారు. అయితే అది సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుండటంతో ఈలోగా వెంకటేష్ మూవీని వచ్చే వేసవికంతా రిలీజ్ చేసే టార్గెట్ తో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.

వచ్చే ఏడాది 2025లో వెంకటేష్ రెండు సినిమాలు రిలీజయ్యే అవకాశముంది. చిరంజీవితో చేస్తున్న మెగా 157తో పాటు ఇప్పుడీ త్రివిక్రమ్ మూవీ కూడా ద్వితీయార్థంలోపే వస్తుంది. ఇవి కాకుండా వెంకీ మామ ఇంకా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇద్దరు కొత్త దర్శకులు కథలు చెప్పే పనిలో ఉన్నారు కానీ ఇంకా ఫైనల్ నెరేషన్ అవ్వలేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తున్న వెంకటేష్ ఇప్పటికే ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్నారు. వంద శాతం నచ్చితే తప్ప ఎవరికీ ఎస్ చెప్పడం లేదు. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాకు వెంకటరమణ, ఆనందరావు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.

This post was last modified on August 15, 2025 7:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

33 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago