కేవలం పదహారు కోట్లతో తీసిన ఒక మీడియం బడ్జెట్ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లు వసూలు చేస్తుందని ఎవరు ఊహిస్తారు. కానీ కాంతార సాధ్యం చేసి చూపించింది. అందుకే దాని ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. హోంబాలే ఫిలిమ్స్ ఈసారి బడ్జెట్ ని కూడా అమాంతం పెంచేసింది. అయితే ఈ మూవీ ప్రారంభ దశ నుంచే విపరీతమైన అవాంతరాలు, ప్రమాదాలు ఎదురుకుంది. ఇదంతా దేవుడి శాపమని, ఆపమనే దానికి సూచనని రకరకాల ప్రచారం జరిగింది. దీనికి నిర్మాతల్లో ఒకరైన చలువే గౌడ స్పందిస్తూ కాంతార కష్టాల వెనుక అసలు కథ చెప్పారు.
కాంతార స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమాకు సంబంధించి జరిగింది తక్కువ ప్రమాదాలే. నవంబర్ 2024 కొల్లూరు సెట్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల కొందరు యూనిట్ సభ్యులు గాయపడ్డారు. తర్వాత జనవరి 2025లో మరొక సెట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికీ ఎవరికీ గాయాలు, ప్రాణ నష్టం జరగలేదు. కొన్ని నెలల క్రితం హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెమెరా లాంటి పరికరాలు నీటిలో మునిగిపోయాయి తప్పించి ఎవరికి ఏం కాలేదు. కాంతార చాప్టర్ 1 మొదలుపెట్టడానికి ముందే గ్రామదేవత పంజుర్లీని అడిగితే కొన్ని అవాంతరాలు వచ్చినా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారని చెప్పింది.
దీంతో చిత్ర బృందం చిత్రీకరణ మొదలుపెట్టి దిగ్విజయంగా విడుదలకు రెడీ చేస్తోంది. మధ్యలో జరిగిన కొన్ని ప్రమాదాలు, మరణాలు షూట్ కి ఏ మాత్రం సంబంధం లేనివి. రోజు ఉదయం 6 గంటలకు మొదలయ్యే షూటింగ్ ఏకధాటిగా జరిగేది. దాని కోసం ఉదయం నాలుగు గంటలకే టీమ్ మొత్తం లేవాల్సి వచ్చింది. ఎనభై శాతానికి పైగా రియల్ లొకేషన్లలోనే కాంతార తీశారు. అక్టోబర్ 2 రిలీజ్ కాబోతున్న కాంతార చాప్టర్ 1 కు భారీ బిజినెస్ ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు కనివిని ఎరుగని రేట్ పలకొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…