Movie News

కాంతార కష్టాల వెనుక అసలు కథ

కేవలం పదహారు కోట్లతో తీసిన ఒక మీడియం బడ్జెట్ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లు వసూలు చేస్తుందని ఎవరు ఊహిస్తారు. కానీ కాంతార సాధ్యం చేసి చూపించింది. అందుకే దాని ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. హోంబాలే ఫిలిమ్స్ ఈసారి బడ్జెట్ ని కూడా అమాంతం పెంచేసింది. అయితే ఈ మూవీ ప్రారంభ దశ నుంచే విపరీతమైన అవాంతరాలు, ప్రమాదాలు ఎదురుకుంది. ఇదంతా దేవుడి శాపమని, ఆపమనే దానికి సూచనని రకరకాల ప్రచారం జరిగింది. దీనికి నిర్మాతల్లో ఒకరైన చలువే గౌడ స్పందిస్తూ కాంతార  కష్టాల వెనుక అసలు కథ చెప్పారు.

కాంతార స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమాకు సంబంధించి జరిగింది తక్కువ ప్రమాదాలే. నవంబర్ 2024 కొల్లూరు సెట్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల కొందరు యూనిట్ సభ్యులు గాయపడ్డారు. తర్వాత జనవరి 2025లో మరొక సెట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికీ ఎవరికీ గాయాలు, ప్రాణ నష్టం జరగలేదు. కొన్ని నెలల క్రితం హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెమెరా లాంటి పరికరాలు నీటిలో మునిగిపోయాయి తప్పించి ఎవరికి ఏం కాలేదు. కాంతార చాప్టర్ 1 మొదలుపెట్టడానికి ముందే గ్రామదేవత పంజుర్లీని అడిగితే కొన్ని అవాంతరాలు వచ్చినా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారని చెప్పింది.

దీంతో చిత్ర బృందం చిత్రీకరణ మొదలుపెట్టి దిగ్విజయంగా విడుదలకు రెడీ చేస్తోంది. మధ్యలో జరిగిన కొన్ని ప్రమాదాలు, మరణాలు షూట్ కి ఏ మాత్రం సంబంధం లేనివి. రోజు ఉదయం 6 గంటలకు మొదలయ్యే షూటింగ్ ఏకధాటిగా జరిగేది. దాని కోసం ఉదయం నాలుగు గంటలకే టీమ్ మొత్తం లేవాల్సి వచ్చింది. ఎనభై శాతానికి పైగా రియల్ లొకేషన్లలోనే కాంతార తీశారు. అక్టోబర్ 2 రిలీజ్ కాబోతున్న కాంతార చాప్టర్ 1 కు భారీ బిజినెస్ ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు కనివిని ఎరుగని రేట్ పలకొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Kumar

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

28 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago