సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదటిసారి కలయికలో తెరకెక్కిన కూలి ఆగస్ట్ 14 విడుదలకు రెడీ అవుతోంది. ఇవాళ చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి క్యాస్టింగ్ తో ఇప్పటికే దీని అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. దానికి తోడు అనిరుధ్ రవిచందర్ సంగీతం నుంచి ఛార్ట్ బస్టర్ పాటలు రావడంతో హైప్ అంతకంతా పెరగడమే జరిగింది. అందుకే అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. ఇప్పటిదాకా కథకు సంబంధించిన క్లూస్ ఇవ్వకుండా దాచి పెట్టిన లోకేష్ కనగరాజ్ మొదటిసారి స్టోరీ గుట్టు విప్పాడు.
అదో వేల మంది కార్మికులు పని చేసే పెద్ద పోర్టు. సముద్రం మీద జరిగే వ్యాపారం కావడం వల్ల అక్కడ తిరుగు లేని డాన్ గా ఎదుగుతాడు సైమన్ (నాగార్జున). బంగారం వాచీల స్మగ్లింగ్ తో ఎన్నో దందాలు రాజ్యమేలుతూ ఉంటాయి. అయితే దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన దేవా (రజినీకాంత్) కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. వాళ్ళలో దేవా స్నేహితుడి (సత్యరాజ్) కూతురు (శృతి హాసన్) కూడా ఉంటుంది. అసలు వీళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, దేవా ఎందుకు అందరిని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, తిరిగి మళ్ళీ వచ్చేందుకు ప్రేరేపించిన పరిస్థితులు ఏంటనేది తెరమీద చూడాలి.
మూడు నిమిషాల ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ లో లోకేష్ కనగరాజ్ ముద్ర స్పష్టంగా కనిపించింది. నాగార్జునని ఆవిష్కరించిన తీరు, ఇతర పాత్రలు, వాటి మధ్య కనెక్షన్లు ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఎప్పటిలాగే అనిరుధ్ రవిచందర్ సంగీతం ఎలివేషన్లకు ఉపయోగపడగా రజనీకాంత్ స్టైల్, స్వాగ్ అభిమానులను గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. లియో, మాస్టర్ తరహాలో బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ మల్టీస్టారర్ కోటింగ్ వల్ల కూలికి ఫ్రెష్ నెస్ వచ్చింది. కొండంత ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా వచ్చిన కూలీ ట్రైలర్ కు తగ్గట్టు అసలు సినిమా ఉంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతే.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…