ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ప్రభాస్ కోసం ఎదురు చూస్తోన్న ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ను అయ్యో పాపం అంటూ మీడియా వాళ్లు జాలి పడిపోతున్నారు. కానీ ఆదిపురుష్కి ప్రభాస్ ముందుగా డేట్స్ ఇవ్వడం వల్ల నాగ్ అశ్విన్కు నష్టమేమీ లేదు. ఇంకా చెప్పాలంటే దీని వల్ల తన సినిమా త్వరగా ఫినిష్ చేయాలనే ఒత్తిడి అతడిపై తగ్గుతుంది.
ఆదిపురుష్ చిత్రానికి కేవలం అరవై రోజుల కాల్షీట్లు మాత్రమే అడిగారట. ఆ సినిమాకు ఆన్ లొకేషన్ కంటే గ్రాఫిక్స్ పరంగా జరిగేదే ఎక్కువ అట. అందుకే కచ్చితంగా అరవై రోజులు మాత్రమే ఇస్తే చాలని ఓం రౌత్ అడగడంతో ప్రభాస్ ఆ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు. ఆ అరవై రోజుల షూట్ చేసేలోపే నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రభాస్ మొదలు పెడతాడు. అంటే నాగ్ అశ్విన్ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పట్టినా కానీ అతనిపై ఎలాంటి ఒత్తిడి వుండదు.
ఇంటర్నేషనల్ లెవల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలని ఆశిస్తోన్న అశ్విన్కు ఇది శుభ వార్తే. అందుకే అతడిని అయ్యో పాపం అనుకోనక్కర్లేదు. ఈ రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించడం వల్ల ప్రభాస్కి వచ్చే మూడేళ్లలోను మూడు రిలీజ్లు వుంటాయి కనుక అతనికీ త్వరగా సినిమాలు చేయడం లేదనే ఒత్తిడి వుండదు.
This post was last modified on November 19, 2020 5:04 pm
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…