ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ప్రభాస్ కోసం ఎదురు చూస్తోన్న ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ను అయ్యో పాపం అంటూ మీడియా వాళ్లు జాలి పడిపోతున్నారు. కానీ ఆదిపురుష్కి ప్రభాస్ ముందుగా డేట్స్ ఇవ్వడం వల్ల నాగ్ అశ్విన్కు నష్టమేమీ లేదు. ఇంకా చెప్పాలంటే దీని వల్ల తన సినిమా త్వరగా ఫినిష్ చేయాలనే ఒత్తిడి అతడిపై తగ్గుతుంది.
ఆదిపురుష్ చిత్రానికి కేవలం అరవై రోజుల కాల్షీట్లు మాత్రమే అడిగారట. ఆ సినిమాకు ఆన్ లొకేషన్ కంటే గ్రాఫిక్స్ పరంగా జరిగేదే ఎక్కువ అట. అందుకే కచ్చితంగా అరవై రోజులు మాత్రమే ఇస్తే చాలని ఓం రౌత్ అడగడంతో ప్రభాస్ ఆ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు. ఆ అరవై రోజుల షూట్ చేసేలోపే నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రభాస్ మొదలు పెడతాడు. అంటే నాగ్ అశ్విన్ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పట్టినా కానీ అతనిపై ఎలాంటి ఒత్తిడి వుండదు.
ఇంటర్నేషనల్ లెవల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలని ఆశిస్తోన్న అశ్విన్కు ఇది శుభ వార్తే. అందుకే అతడిని అయ్యో పాపం అనుకోనక్కర్లేదు. ఈ రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించడం వల్ల ప్రభాస్కి వచ్చే మూడేళ్లలోను మూడు రిలీజ్లు వుంటాయి కనుక అతనికీ త్వరగా సినిమాలు చేయడం లేదనే ఒత్తిడి వుండదు.
This post was last modified on November 19, 2020 5:04 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…