ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ప్రభాస్ కోసం ఎదురు చూస్తోన్న ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ను అయ్యో పాపం అంటూ మీడియా వాళ్లు జాలి పడిపోతున్నారు. కానీ ఆదిపురుష్కి ప్రభాస్ ముందుగా డేట్స్ ఇవ్వడం వల్ల నాగ్ అశ్విన్కు నష్టమేమీ లేదు. ఇంకా చెప్పాలంటే దీని వల్ల తన సినిమా త్వరగా ఫినిష్ చేయాలనే ఒత్తిడి అతడిపై తగ్గుతుంది.
ఆదిపురుష్ చిత్రానికి కేవలం అరవై రోజుల కాల్షీట్లు మాత్రమే అడిగారట. ఆ సినిమాకు ఆన్ లొకేషన్ కంటే గ్రాఫిక్స్ పరంగా జరిగేదే ఎక్కువ అట. అందుకే కచ్చితంగా అరవై రోజులు మాత్రమే ఇస్తే చాలని ఓం రౌత్ అడగడంతో ప్రభాస్ ఆ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు. ఆ అరవై రోజుల షూట్ చేసేలోపే నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రభాస్ మొదలు పెడతాడు. అంటే నాగ్ అశ్విన్ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పట్టినా కానీ అతనిపై ఎలాంటి ఒత్తిడి వుండదు.
ఇంటర్నేషనల్ లెవల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలని ఆశిస్తోన్న అశ్విన్కు ఇది శుభ వార్తే. అందుకే అతడిని అయ్యో పాపం అనుకోనక్కర్లేదు. ఈ రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించడం వల్ల ప్రభాస్కి వచ్చే మూడేళ్లలోను మూడు రిలీజ్లు వుంటాయి కనుక అతనికీ త్వరగా సినిమాలు చేయడం లేదనే ఒత్తిడి వుండదు.
This post was last modified on November 19, 2020 5:04 pm
ఇంకా నాలుగు నెలలు ఉండగానే 2027 సంక్రాంతి గురించి ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లలో విపరీతమైన చర్చలు మొదలయ్యాయి. నేనంటే నేనంటూ…
భారత పోరుగు దేశం, దేవభూమి నేపాల్లో ఒక్కసారిగా సంభవించిన జల ప్రళయం.. ప్రజలను అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా ఉప్పొంగిన కోశీ…
మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…