బాలీవుడ్, టాలీవుడ్ కలయికకు శ్రీకారం చుడుతూ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన వార్ 2 ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన టీజర్ ఆశించిన స్థాయిలో అంచనాలు పెంచలేకపోయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. బిజినెస్, ఓపెనింగ్స్ లో దీనిది కీలక పాత్ర కావడంతో ఎలా ఉంటుందోననే ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు వెర్షన్ ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ జరగడానికి ఒకే కారణం తారక్. మరి ఇంత హైప్ మోస్తూ కూలితో తలపడుతున్న వార్ 2 శాంపిల్స్ ఎలా ఉన్నాయి.
దేశంలో కోసం తన ఉనికిని సైతం వదులుకునేందుకు సిద్ధ పడే సిన్సియర్ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్). ఎలాంటి లక్ష్యమైనా సరే ఆయుధంగా మారేందుకు సిద్ధపడే మరో పవర్ ఫుల్ ఏజెంట్ విక్రమ్ (జూనియర్ ఎన్టీఆర్). ఈ ఇద్దరి టార్గెట్లు వేరుగా ఉంటాయి. శత్రువుల వల్ల ప్రమాదకర వలయాలు ఏర్పడతాయి. ప్రాణాలు పణంగా పెట్టే యుద్ధంలో భాగమవుతారు. వేర్వేరుగా ప్రయాణం చేస్తూ వచ్చిన కబీర్, విక్రమ్ చేతులు కలిపే సమయం వస్తుంది. అయితే పరిస్థితులు వాళ్ళను కొట్టుకునేలా కూడా చేస్తాయి. అసలు వార్ 2 ఎందుకు వచ్చింది, ఈ జంట ఎలాంటి విధ్వంసాలు చేసిందనేది తెరమీద చూడాలి.
రెండు నిమిషాల నలభై సెకండ్ల వీడియోలో ఎక్కువ యాక్షన్ విజువల్స్ కే ప్రాధాన్యం ఇచ్చారు. బ్లాస్టులు, ఛేజులు, విమానాల మీద స్టంటులు, రన్నింగ్ ట్రైన్ మీద సాహసాలు ఇలా చాలానే పొందుపరిచారు. వార్, పఠాన్, ఏక్ దా టైగర్ పంథానే ఫాలో అయినప్పటికీ హృతిక్, తారక్ ఫేస్ అఫ్ అంచనాలు పెంచేలా ఉంది. కథ ఎక్కువగా రివీల్ చేయకుండా ఫైట్లతో నింపేశారు. కియారా అద్వానీకి గ్లామర్, వయొలెన్స్ రెండూ దక్కాయి. ప్రీతమ్ అందించిన సంగీతం రెగ్యులర్ గానే ఉంది. యష్ రాజ్ ప్రొడక్షన్ వేల్యూస్ ఘనంగా ఉన్నాయి. అభిమానులు చెందేలా ఉంది కాబట్టి హైప్ పెరగడానికి ట్రైలర్ సరిపోతుంది.
This post was last modified on July 25, 2025 10:51 am
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…