ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్.’తో బిజీగా వున్నాడు కాబట్టి, ఆ సినిమాకి సంబంధించి తన వర్క్ ఎప్పటికి పూర్తవుతుందనేది తెలియదు కాబట్టి… అంతవరకు వేచి వుండలేక త్రివిక్రమ్ ఈలోగా మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అగ్ర హీరోతో సినిమాకు ఎన్టీఆర్ అభ్యంతరం చెబుతున్నాడని ఒక మిడిల్ రేంజ్ సినిమా చేసే ఆలోచనలో వున్నాడని కూడా చెప్పుకున్నారు. అయితే త్రివిక్రమ్ ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టి తారక్ కోసమే ఎదురు చూస్తున్నాడు.
మార్చి నుంచి తాను ఖచ్చితంగా అందుబాటులో వుంటానని తారక్ మాట ఇవ్వడంతో త్రివిక్రమ్ మిగతా ప్లాన్స్ రద్దు చేసుకున్నాడు. అంతే కాకుండా ఆ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరం చేస్తున్నాడు. తద్వారా తారక్పై త్రివిక్రమ్ ఒత్తిడి పెంచుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ తప్పనిసరిగా మార్చి నుంచి ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనాలి. కానీ అది ఎన్టీఆర్ చేతిలో లేదు. రాజమౌళి ఎప్పటికి తనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే దానిపై క్లారిటీ లేదు.
ఇదిలావుంటే తారక్ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు పవన్తో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రానికి త్రివిక్రమ్ మార్పులు చేసి, మాటలు అందిస్తారనే ప్రచారం జరుగుతోంది.
This post was last modified on November 16, 2020 4:19 pm
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…